NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Mahindra: EV బ్యాటరీల స్థానిక ఉత్పత్తి పరిశీలినలో కంపెనీ CEO
    తదుపరి వార్తా కథనం
    Mahindra: EV బ్యాటరీల స్థానిక ఉత్పత్తి పరిశీలినలో కంపెనీ CEO
    Mahindra: EV బ్యాటరీల స్థానిక ఉత్పత్తి పరిశీలినలో కంపెనీ CEO

    Mahindra: EV బ్యాటరీల స్థానిక ఉత్పత్తి పరిశీలినలో కంపెనీ CEO

    వ్రాసిన వారు Stalin
    Jun 17, 2024
    01:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహీంద్రా & మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాటరీల స్థానిక ఉత్పత్తిని పరిశీలిస్తున్నట్లు కంపెనీ CEO, అనిష్ షా వెల్లడించారు.

    భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తిరిగి తన పట్టును పొందేందుకు విస్తృత వ్యూహంలో భాగంగా ఈ ప్రతిపాదనలు చేస్తోంది.

    కంపెనీ మరింత నిశితంగా పరిశీలిస్తూనే ఉన్న ఒక ప్రాంతం సెల్ తయారీ . ఇది మాకు చాలా అవసరం అని తాము భావిస్తే, సెల్ తయారీకి భాగస్వామ్యాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

    భాగస్వామ్య శోధన 

    గ్లోబల్ టెక్నాలజీ,ఈక్విటీ భాగస్వాముల కోసం మహీంద్రా శోధన

    భారత్‌లో స్థానికంగా సెల్ తయారీని ప్రారంభించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

    ఇందుకోసం గ్లోబల్ టెక్నాలజీ , ప్రతిపాదిత ప్రైవేట్ ఈక్విటీ భాగస్వాములు ముందుకు రావాలని కంపెనీ ఆశిస్తుందన్నారు.

    "తాము గ్లోబల్ టెక్నాలజీ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామన్నారు. దాంతో పాటు ప్రైవేట్ ఈక్విటీ భాగస్వాములను కూడా పరిగణనలోకి తీసుకుంటామని అనీష్ షా వివరించారు. అంతే తప్ప తమ మొత్తం మూలధనాన్నిఈ రంగంలో ఉంచబోమని ఆయన తేల్చి చెప్పారు.

    వ్యూహం 

    EV విభాగంలో మార్కెట్ వాటాను మళ్లీ పొందేందుకు మహీంద్రా వ్యూహం 

    భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రారంభమైన నాటినుంచి, టాటా మోటార్స్‌కు మహీంద్రా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది.

    కంపెనీ ప్రస్తుతం టాటా మోటార్స్ ఆధిపత్యంలో ఉన్న విభాగంలో XUV400 అనే ఒక మోడల్‌ను మాత్రమే అందిస్తోంది.

    అయినప్పటికీ, మహీంద్రా కొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రారంభించాలని యోచిస్తోంది .

    దాని రాబోయే ఎలక్ట్రిక్ కార్ల కోసం ఒక సమగ్ర పర్యావరణ వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో స్థానికంగా ఉత్పత్తి చేసిన EV బ్యాటరీలు ఉంటాయి.

    భవిష్యత్తు ప్రణాళికలు 

    మహీంద్రా ఎలక్ట్రిక్ ప్రతిపాదిత పెట్టుబడి ప్రణాళికలు 

    2030 నాటికి దాని ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్మ్ మహీంద్రా ఎలక్ట్రిక్ లిస్టింగ్‌కు సంబంధించిన ప్రణాళికలను కూడా CEO వెల్లడించారు.

    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్యాక్‌లను దేశీయంగా ఉత్పత్తి చేసే వారి వ్యూహంలో ఈ చర్య కీలక భాగంగా పరిగణించనుంది.

    అయితే, ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ టేకాఫ్ కావడానికి సమయం కావాలి. కాబట్టి వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఈ సాధ్యం కాదని షా స్పష్టం చేశారు.

    2030 నాటికి తొమ్మిది ICE SUVలు, ఏడు EVలు ఏడు తేలికపాటి వాణిజ్య వాహనాలను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహీంద్రా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మహీంద్రా

    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ కార్
    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం ఎలక్ట్రిక్ వాహనాలు
    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి కార్
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025