NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Mileage Issue: మైలేజీ విషయంలో మోసం.. ఎలక్ట్రిక్‌ కార్‌ సంస్థలకు భారీ జరిమానా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mileage Issue: మైలేజీ విషయంలో మోసం.. ఎలక్ట్రిక్‌ కార్‌ సంస్థలకు భారీ జరిమానా
    మైలేజీ విషయంలో మోసం.. ఎలక్ట్రిక్‌ కార్‌ సంస్థలకు భారీ జరిమానా

    Mileage Issue: మైలేజీ విషయంలో మోసం.. ఎలక్ట్రిక్‌ కార్‌ సంస్థలకు భారీ జరిమానా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 26, 2025
    11:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మైలేజీ విషయంలో తప్పుదారి పట్టించిన నియాన్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలపై హైదరాబాద్‌ కమిషన్-2 వినియోగదారుల న్యాయమండలి తీవ్ర స్థాయిలో స్పందించింది.

    వినియోగదారుడి మానసిక వేదనను దృష్టిలో పెట్టుకొని రెండు సంస్థలు కలిపి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని, అదనంగా రూ.10 వేలు కేసు ఖర్చులు చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ మొత్తం తీర్పు వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లో చెల్లించాలి. ఆలస్యం జరిగితే 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని కమిషన్‌ హెచ్చరించింది.

    బల్కంపేటకు చెందిన చెన్నంశెట్టి సతీష్‌కుమార్‌ తాడ్‌బండ్‌లోని నియాన్ మోటార్స్‌ షోరూమ్‌ ద్వారా 2023 మార్చిలో ఎక్స్‌యూవీ-400 ఎలక్ట్రిక్ కారును రూ.19,63,306కి కొనుగోలు చేశారు.

    Details

    పట్టించుకోని కంపెనీ

    కొనుగోలు సమయంలో కంపెనీ ప్రతినిధులు 100 శాతం ఛార్జింగ్‌తో 456 కిలోమీటర్లు, 80 శాతం ఛార్జింగ్‌తో 364 కిలోమీటర్ల మైలేజీ వస్తుందంటూ హామీ ఇచ్చారు.

    అయితే, వాస్తవంగా వాహనం 240 కిలోమీటర్లకు మించి మైలేజీ ఇవ్వకపోవడంతో సతీష్‌కుమార్‌ నిరాశకు గురయ్యారు.

    ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా, సమస్యను పరిష్కరించలేదని బాధితుడు తెలిపాడు.

    వాహనాన్ని సర్వీసింగ్‌ కేంద్రానికి పంపినా మైలేజీలో ఎలాంటి మార్పు రాలేదు. ఎక్స్‌ఛేంజ్‌లో వేరే వాహనం ఇవ్వాలన్న విజ్ఞప్తినీ కంపెనీ పట్టించుకోలేదు.

    Details

    మైలేజీ విషయంలో సంయుక్తంగా అధ్యయనం

    దీంతో బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనికి ప్రతివాద సంస్థలు ప్రతిస్పందిస్తూ ఆరోపణలను ఖండించాయి.

    అయితే కమిషన్‌ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని మైలేజీ విషయంలో సంయుక్తంగా అధ్యయనం జరిపింది.

    టెస్ట్ డ్రైవ్ ద్వారా 11 శాతం బ్యాటరీతో కేవలం 23.7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగినట్టు తేలింది.

    ఈ నివేదిక ఆధారంగా కమిషన్‌ నిర్ణయం తీసుకుని, వినియోగదారుడికి న్యాయం చేస్తూ రెండు సంస్థలపై సంయుక్తంగా జరిమానా విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహీంద్రా
    ఎలక్ట్రిక్ వాహనాలు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    మహీంద్రా

    Mahindra XUV700 : లక్ష కార్లను రీకాల్ చేసిన మహీంద్రా  ఆటో మొబైల్
    ICC World Cup 2023: వరల్డ్ కప్‌కు స్పాన్సర్‌గా మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్స్
    'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా  తాజా వార్తలు
    Safest Cars In India :ఇండియాలో NCAP ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే..! హ్యుందాయ్

    ఎలక్ట్రిక్ వాహనాలు

    Electric cars: 2023లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే  కార్
    Xiaomi EV: డిసెంబర్ 28న షావోమి ఈవీ కారు లాంచ్.. ఎలా ఉందో చూశారా?  ఆటో మొబైల్
    Ather 450 X Apex : జనవరి 6న ఏథర్ 450 ఎక్స్ అపెక్స్ లాంచ్ ఏథర్ ఎనర్జీ
     Ampere: టెస్టింగ్ దశలో అంపియార్ NXG ఇ-స్కూటర్.. డిజైన్ ఎలా ఉందంటే? ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025