NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల నగదు రహిత చికిత్స..  
    తదుపరి వార్తా కథనం
    Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల నగదు రహిత చికిత్స..  
    రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల నగదు రహిత చికిత్స..

    Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల నగదు రహిత చికిత్స..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 08, 2025
    01:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రకటించారు.

    ఇందులో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకం అమలు చేయబడుతుంది.

    ప్రమాదంలో గాయపడిన వారు మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే ఖర్చుకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది.

    కానీ, ఈ పథకాన్ని ఉపయోగించాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని గడ్కరీ స్పష్టం చేశారు.

    హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఆయన తెలిపారు.

    వివరాలు 

    2024లో 1.80 లక్షల మంది మృతి 

    2024లో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.80 లక్షల మంది మరణించడం అనేది ఆందోళన కలిగించే అంశమని గడ్కరీ పేర్కొన్నారు.

    వీటిలో 30 వేల మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగినవని చెప్పారు.

    రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల యువత అధికంగా ఉన్నారని, దాదాపు 66 శాతం ప్రమాద బాధితులు ఈ వర్గానికి చెందినవారని వెల్లడించారు.

    గత ఏడాది విద్యాసంస్థల పరిసరాల్లో సరైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు లేకపోవడం వల్ల దాదాపు 10 వేల మంది పిల్లలు ప్రమాదాల్లో పడినట్లు గడ్కరీ పేర్కొన్నారు.

    వివరాలు 

    ఆటోరిక్షాలు, విద్యాసంస్థల మినీ బస్సుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక నిబంధనలు 

    ఈ పరిస్థితిని మార్చడానికి ఆటోరిక్షాలు, విద్యాసంస్థల మినీ బస్సుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను అమల్లోకి తీసుకురావలసి వచ్చిందని తెలిపారు.

    దిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రులతో సమావేశమైన గడ్కరీ, రోడ్డు రవాణా పాలసీల గురించి చర్చించారు.

    ఈ సమావేశం అనంతరం రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రకటించారు,

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..!  ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు యూఏఈలో సంప్రదాయ స్వాగతం .. ఇంతకీ ఈ సంప్రదాయం ఏంటంటే?(వీడియో)  డొనాల్డ్ ట్రంప్
    Renu Desai: అర్థం లేని చర్చలు మానేసి, దేశాభిమానంతో ముందుకెళ్లండి: రేణూ దేశాయ్ టాలీవుడ్
    IndusInd Bank- Airtel: నష్టాల్లో ట్రేడవుతున్న ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఎందుకంటే..? షేర్ విలువ

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025