Maruti Suzuki Japan exports: జపాన్లో మన కార్లకు భలే క్రేజ్.. ఫ్రాంక్స్, జిమ్నీ, ఈ విటారా ఎగుమతులు లక్ష దాటాయి!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో తయారైన మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్, ఫ్రాంక్స్, ఈ విటారా కార్ల ఎగుమతులు జపాన్కు కలిపి 1 లక్ష యూనిట్లు మైలురాయిని దాటాయి. ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన, పోటీ ఎక్కువగా ఉండే ఆటోమొబైల్ మార్కెట్లలో ఒకటైన జపాన్లో ఈ స్థాయి ఎగుమతులు సాధించడం మారుతి సుజుకికి కీలక విజయంగా నిలిచింది.
వివరాలు
2024లో ఫ్రాంక్స్తో ప్రారంభం
జపాన్కు మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎగుమతులు 2024 ఆగస్టులో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబరులో జిమ్నీ 5-డోర్ ఎగుమతులు మొదలయ్యాయి.
ఇక 2025 సెప్టెంబరులో ఈ విటారా కూడా జపాన్ ఎగుమతి జాబితాలో చేరింది. జిమ్నీ 5-డోర్, ఈ విటారా మోడళ్లను ప్రత్యేకంగా భారత్లోనే తయారు చేస్తున్నారు.
దీంతో సుజుకి గ్లోబల్ తయారీ వ్యవస్థలో భారత్ కీలక తయారీ కేంద్రంగా మారుతున్న విషయం స్పష్టమవుతోంది.
వివరాలు
మారుతికి రెండో అతిపెద్ద ఎగుమతి మార్కెట్ జపాన్
2025-26 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఎగుమతులకు జపాన్ రెండో అతిపెద్ద మార్కెట్గా నిలిచింది.
2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు కాలంలోనూ జపాన్ అదే స్థానాన్ని కొనసాగించింది.
ఫ్రాంక్స్, జిమ్నీ 5-డోర్, ఈ విటారా మోడళ్లకు జపాన్లో లభించిన ఆదరణతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో జపాన్లో సుజుకి అత్యధిక వాహనాలను దిగుమతి చేసుకున్న సంస్థగా నిలిచింది.
ఆ దేశంలో సుజుకి దిగుమతుల్లో దాదాపు మొత్తం మారుతి సుజుకి తయారు చేసిన మోడళ్లదే వాటా కావడం విశేషం.
వివరాలు
120 దేశాలకు ఎగుమతులు
సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ నెట్వర్క్ను ఉపయోగించుకుంటూ మారుతి సుజుకి ప్రస్తుతం దాదాపు 120 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తోంది.
2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు భారత్లో అతిపెద్ద ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా మారుతి సుజుకి కొనసాగింది.
2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో కంపెనీ 1.8 లక్షలకు పైగా వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది.
ప్రస్తుతం భారత్ నుంచి జరిగే మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మారుతి సుజుకి వాటా సగానికి పైగా ఉంది.
వివరాలు
'భారత్-జపాన్ భాగస్వామ్యానికి ప్రతీక'
మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేఉచి మాట్లాడుతూ.. ఈ ఎగుమతి మైలురాయి భారత్-జపాన్ భాగస్వామ్యం సాధించిన అద్భుతమైన పురోగతికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
భారత్లో ఆటోమొబైల్స్ తయారు చేయాలన్న సుజుకి దృష్టితో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా వాహనాలను జపాన్ వినియోగదారులు ఆదరించే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.
ఈ విజయంతో మారుతి సుజుకి ఎగుమతులకు జపాన్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఎదిగిందని హిసాషి టకేఉచి తెలిపారు.