NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / BMW Price Hike: బీఎండబ్ల్యూ వినియోగదారులకు షాక్.. వచ్చే జనవరి నుంచి ధరల పెరుగుదల 
    తదుపరి వార్తా కథనం
    BMW Price Hike: బీఎండబ్ల్యూ వినియోగదారులకు షాక్.. వచ్చే జనవరి నుంచి ధరల పెరుగుదల 
    బీఎండబ్ల్యూ వినియోగదారులకు షాక్.. వచ్చే జనవరి నుంచి ధరల పెరుగుదల

    BMW Price Hike: బీఎండబ్ల్యూ వినియోగదారులకు షాక్.. వచ్చే జనవరి నుంచి ధరల పెరుగుదల 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 23, 2024
    02:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ధరలు త్వరలో మరింత ప్రీమియం కానున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా, తన వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది.

    కొత్త ధరలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని బీఎండబ్ల్యూ స్పష్టం చేసింది.

    ఉత్పత్తి వ్యయం పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

    భారతీయంగా ఉత్పత్తి అయ్యే బీఎండబ్ల్యూ 2 సిరీస్‌ గ్రాన్‌ కూపే, 3 సిరీస్‌, 5 సిరీస్‌, ఎక్స్‌1, ఎక్స్‌3, ఎక్స్‌5, ఎక్స్‌7 వంటి మోడళ్లతో పాటు దిగుమతి చేసుకునే ఐ సిరీస్‌ (i4, i5, i7), స్పోర్ట్స్ మోడళ్లపై కూడా ధరలు పెరుగుతాయి.

    Details

    3శాతం పెంచుతున్నట్లు ప్రకటన

    ప్రస్తుత ధరలు రూ.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్న బీఎండబ్ల్యూ కారు ధరల పెంపు కనిష్ఠంగా లక్షల రూపాయల్లో ఉంటుందని అంచనా.

    ఇక మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ కూడా 2025 జనవరి 1 నుంచి తన కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించింది.

    ఈ పెరుగుదల వల్ల మెర్సిడెస్‌ కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెరుగుతాయని అంచనా.

    ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.

    ప్రస్తుతం మెర్సిడెస్‌ భారతీయ మార్కెట్లో రూ.45 లక్షల ఏ క్లాస్‌ కార్ల నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు విక్రయిస్తోంది.

    Details

    అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరిగే ఛాన్స్

    లగ్జరీ కార్ల ధరల పెరుగుదల, ప్రీమియం మార్కెట్లో కొనుగోలుదారులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

    ఈ పరిస్థితుల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌లు పెరగవచ్చునని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    భారత మార్కెట్లో లగ్జరీ కార్ల కోసం పోటీ పడుతున్న బ్రాండ్లు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల నేపథ్యంలో తమ ధరలను సవరించడం అనివార్యమైంది.

    దీని ప్రభావం వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీఎండబ్ల్యూ కారు
    ఆటో మొబైల్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బీఎండబ్ల్యూ కారు

    BMW iX1 : భారత్ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ తొలి లగ్జరీ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 440 కి.మీ ప్రయాణం ఆటో మొబైల్
    BMW M3 CS: 2025లో రానున్న శక్తివంతమైన బీఎండబ్ల్యూ, ధర ఎంతో తెలుసా ఆటో మొబైల్
    Cars Recall : 51 మిలియన్ కార్లను రీకాల్ చేయనున్న బడా కంపెనీలు ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    కొత్త కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ బెనెల్లీ 502C.. ఏ స్కూటర్ బెస్ట్? బైక్
    Flying Car: సుజుకి నుండి ఎగిరే కారు.. 100 కి.మీ గరిష్ట వేగంతో ఎగురుతుంది  ఆటోమొబైల్స్
    Toyota Taisor: టయోటా SUV టేజర్ వీడియో విడుదల.. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌తో పోటీ  ఆటోమొబైల్స్
    Mahindra XUV 3XO: పనోరమిక్ సన్‌రూఫ్‌,కొత్త ఫీచర్లతో మహీంద్రా XUV 3XO  మహీంద్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025