NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Most Powerful Women: ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు 
    తదుపరి వార్తా కథనం
    Most Powerful Women: ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు 
    ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు

    Most Powerful Women: ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 13, 2024
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మరోసారి స్థానం పొందారు.

    ఈ జాబితాలో ఆమెకి వరుసగా ఆరోసారి చోటు లభించింది. భారత్ నుండి ఈ జాబితాలో మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారు, వీరిలో నిర్మలమ్మ అగ్రస్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు.

    ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌ 28వ స్థానంలో నిలిచారు.

    గత సంవత్సరం ఆమె 32వ స్థానంలో ఉన్నారు.భారత్ నుండి హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్‌ మల్హోత్రా ఈ జాబితాలో 81వ స్థానాన్ని దక్కించుకున్నారు, గతంలో ఆమె 60వ స్థానంలో ఉండగా ఈసారి స్థానం తగ్గింది.

    వివరాలు 

    మరోసారి అగ్రస్థానంలో ఉర్సులా వాన్‌ దెర్‌ లెయెన్‌ 

    అలాగే, బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందర్‌ షా తాజా జాబితాలో 82వ స్థానంలో నిలిచారు. గత సంవత్సరం కూడా ఆమె ఈ జాబితాలో ఉండి శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందారు.

    ఈ జాబితాలో యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా వాన్‌ దెర్‌ లెయెన్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు.

    యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధ్యక్షురాలైన క్రిస్టినా లగార్డ్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని రెండు, మూడు స్థానాలలో ఉన్నారు.

    బిల్‌గేట్స్‌ మాజీ భార్య మిలిండా ఫ్రెంచ్‌ గేట్స్‌ 8వ స్థానం, అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకంజీ స్కాట్‌ 9వ స్థానం, ప్రముఖ పాప్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌ 23వ స్థానం లో ఉన్నారు.

    వివరాలు 

     జొహొర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్‌ పరిశ్రమ

    భారతదేశంలో తొలి, పూర్తిస్థాయి ఆర్థికమంత్రి అయిన నిర్మలా సీతారామన్‌ రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీసులలో కీలక పదవులు చేపట్టారు.

    హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్‌ కుమార్తె రోష్నీ నాడార్‌ మల్హోత్రా జులై 2020లో హెచ్‌సీఎల్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

    వ్యూహాత్మక నిర్ణయాలతో సంస్థను అగ్ర స్థితిలో నిలిపినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది.

    1978లో కిరణ్‌ మజూందర్‌ షా బయోకాన్‌ను స్థాపించారు. ఆమె తరువాత కాలంలో భారత్‌లో అత్యంత సంపన్న మహిళలలో ఒకరిగా ఎదిగారు.

    బయోకాన్‌కు మలేషియాలోని జొహొర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్‌ పరిశ్రమ ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నిర్మలా సీతారామన్

    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి
    అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్  చేసిన విపక్షాలు  లోక్‌సభ
    లోక్‌సభలో ద్రౌపది అంశంపై దుమారం.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025