Page Loader
Most Powerful Women: ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు 
ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు

Most Powerful Women: ఫోర్బ్స్ 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 13, 2024
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో మరోసారి స్థానం పొందారు. ఈ జాబితాలో ఆమెకి వరుసగా ఆరోసారి చోటు లభించింది. భారత్ నుండి ఈ జాబితాలో మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారు, వీరిలో నిర్మలమ్మ అగ్రస్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌ 28వ స్థానంలో నిలిచారు. గత సంవత్సరం ఆమె 32వ స్థానంలో ఉన్నారు.భారత్ నుండి హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్‌ మల్హోత్రా ఈ జాబితాలో 81వ స్థానాన్ని దక్కించుకున్నారు, గతంలో ఆమె 60వ స్థానంలో ఉండగా ఈసారి స్థానం తగ్గింది.

వివరాలు 

మరోసారి అగ్రస్థానంలో ఉర్సులా వాన్‌ దెర్‌ లెయెన్‌ 

అలాగే, బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందర్‌ షా తాజా జాబితాలో 82వ స్థానంలో నిలిచారు. గత సంవత్సరం కూడా ఆమె ఈ జాబితాలో ఉండి శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా వాన్‌ దెర్‌ లెయెన్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధ్యక్షురాలైన క్రిస్టినా లగార్డ్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని రెండు, మూడు స్థానాలలో ఉన్నారు. బిల్‌గేట్స్‌ మాజీ భార్య మిలిండా ఫ్రెంచ్‌ గేట్స్‌ 8వ స్థానం, అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకంజీ స్కాట్‌ 9వ స్థానం, ప్రముఖ పాప్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌ 23వ స్థానం లో ఉన్నారు.

వివరాలు 

 జొహొర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్‌ పరిశ్రమ

భారతదేశంలో తొలి, పూర్తిస్థాయి ఆర్థికమంత్రి అయిన నిర్మలా సీతారామన్‌ రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీసులలో కీలక పదవులు చేపట్టారు. హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్‌ కుమార్తె రోష్నీ నాడార్‌ మల్హోత్రా జులై 2020లో హెచ్‌సీఎల్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వ్యూహాత్మక నిర్ణయాలతో సంస్థను అగ్ర స్థితిలో నిలిపినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. 1978లో కిరణ్‌ మజూందర్‌ షా బయోకాన్‌ను స్థాపించారు. ఆమె తరువాత కాలంలో భారత్‌లో అత్యంత సంపన్న మహిళలలో ఒకరిగా ఎదిగారు. బయోకాన్‌కు మలేషియాలోని జొహొర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్‌ పరిశ్రమ ఉంది.