Aadhaar: ఆధార్ అప్డేట్ కొత్త నియమాలు.. ఆన్లైన్ ప్రాసెస్,ఫీజులు,లింకింగ్ వివరాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆధార్ అప్డేట్ విధానంలో నవంబర్ నుంచి పెద్ద మార్పులు తీసుకొచ్చింది యూఐడీఏఐ (Unique Identification Authority of India-UIDAI). కొత్త నియమాలు అమల్లోకి రావడంతో ఆధార్ అప్డేట్ ప్రక్రియ ఇక సులభంగా, వేగంగా సాగనుంది. పత్రాలు సమర్పించాల్సిన తంటా లేకుండానే ఆన్లైన్లోనే మార్పులు చేయవచ్చు. ఇప్పటి నుంచి myAadhaar పోర్టల్ ద్వారా పేరు,చిరునామా,జన్మతేదీ,మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను పూర్తిగా ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఈసిస్టమ్ ఇతర ప్రభుత్వ డేటాబేస్లైన PAN,పాస్పోర్ట్ మొదలైన వాటితో క్రాస్ వెరిఫై చేసుకునే విధంగా రూపొందించారు. దీంతో వ్యక్తిగతంగా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గనుంది. అయితే, ఫింగర్ప్రింట్లు, ఐరిస్ స్కాన్,ఫోటో వంటి బయోమెట్రిక్ అప్డేట్ల కోసం మాత్రం ఆధార్ సేవా కేంద్రంను తప్పనిసరిగా సందర్శించాల్సిందే.
వివరాలు
కొత్త ఫీజు వివరాలు:
పేరు, చిరునామా, జన్మతేదీ వంటి వివరాల మార్పులకు ₹75 బయోమెట్రిక్ అప్డేట్లకు ₹125 2026 జూన్ 14 వరకు ఆన్లైన్ డాక్యుమెంట్ అప్డేట్లు ఉచితం 5-7 సంవత్సరాలు, 15-17 సంవత్సరాల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం
వివరాలు
ఆధార్-పాన్ లింకింగ్ తప్పనిసరి:
2025 డిసెంబర్ 31 లోగా ఆధార్ను పాన్తో లింక్ చేయడం తప్పనిసరి. ఆ గడువు తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు 2026 జనవరి 1 నుంచి డీయాక్టివేట్ అవుతాయి. కొత్తగా పాన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు కూడా ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంకులు,ఫైనాన్షియల్ సంస్థలకు యూఐడీఏఐ కొత్త e-KYC మార్గదర్శకాలు ఇచ్చింది. వీటిలో OTP, వీడియో వెరిఫికేషన్ వంటి పద్ధతులను ఉపయోగించి మరింత పారదర్శకంగా, పేపర్లెస్గా కస్టమర్ గుర్తింపును నిర్ధారించవచ్చు.
వివరాలు
ప్రజలకు దాని ప్రయోజనం:
ఈ కొత్త నియమాలు సాధారణ ప్రజలకు పెద్ద ఉపశమనం ఇవ్వనున్నాయి. ఆధార్ సెంటర్లలో గంటల తరబడి క్యూల్లో నిలబడే తంటాలు, డాక్యుమెంట్ సమస్యలు ఇక తగ్గిపోనున్నాయి. ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్తో ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారా అప్డేట్లు చేయడం సాధ్యమవుతుంది.