Akash Ambani:IPOకు ముందు జియో ప్లాట్ఫాంస్కు ఎండీగా ఆకాష్ అంబానీ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో అతిపెద్ద IPOలలో ఒకటిగా భావిస్తున్న జియో ప్లాట్ఫార్మ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆకాష్ అంబానీని ఐదేళ్ల పాటు నియమించింది. ఈ మేరకు మే 7న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA)వద్ద దాఖలు చేసిన పత్రాల్లో కంపెనీ వెల్లడించింది. ఏప్రిల్ 9న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సభ్యుల ఆమోదానికి లోబడి ఆకాష్ అంబానీని ఎండీగా నియమిస్తున్నట్లు పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఇప్పటికే రిలయన్స్ జియోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరిన ఆయన, 2022 జూన్లో టెలికాం విభాగ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
వివరాలు
జియో ప్లాట్ఫాంస్ స్వతంత్ర డైరెక్టర్గా Zia Mody
ఇప్పుడు జియో ప్లాట్ఫాంస్ ఎండీగా నియమితులవడంతో అంబానీ కుటుంబంలో ఈ హోదా దక్కించుకున్న తొలి వారసుడిగా నిలిచారు. ఇదే సమయంలో ప్రముఖ న్యాయ నిపుణురాలు Zia Modyను కూడా జియో ప్లాట్ఫాంస్ స్వతంత్ర డైరెక్టర్గా ఐదేళ్లకు నియమించింది. ఆమె AZB & Partners సంస్థ సహ వ్యవస్థాపకురాలు. కంపెనీ IPOకు ముందు ఈ నాయకత్వ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వివరాలు
కంపెనీ ఆపరేషన్స్ ఆదాయం రూ.1.72 లక్షల కోట్లు
మరోవైపు జియో ప్లాట్ఫాంస్ ఆర్థిక ఫలితాలు కూడా బలంగా ఉన్నాయి. FY26లో కంపెనీ ఆపరేషన్స్ ఆదాయం 14.7 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరింది. నికర లాభం 15 శాతం పెరిగి రూ.30,053 కోట్లుగా నమోదైంది. EBITDA కూడా 19 శాతం వృద్ధితో రూ.76,255 కోట్లకు పెరిగింది. కొత్త సబ్స్క్రైబర్లు, అధిక డేటా వినియోగం, హోమ్ బ్రాడ్బ్యాండ్ సేవలకు పెరుగుతున్న ఆదరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా కంపెనీ తెలిపింది.