NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Amul Milk:పెరిగిన అమూల్ పాల ధర..దేశవ్యాప్తంగా నేటి నుండి కొత్త రేటు 
    తదుపరి వార్తా కథనం
    Amul Milk:పెరిగిన అమూల్ పాల ధర..దేశవ్యాప్తంగా నేటి నుండి కొత్త రేటు 
    పెరిగిన అమూల్ పాల ధర..దేశవ్యాప్తంగా నేటి నుండి కొత్త రేటు

    Amul Milk:పెరిగిన అమూల్ పాల ధర..దేశవ్యాప్తంగా నేటి నుండి కొత్త రేటు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2024
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు అమూల్ పాలు ఖరీదైనవిగా మారాయి.

    మొత్తం నిర్వహణ ఖర్చులు,పాల ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో సోమవారం నుంచి అన్ని రకాల అమూల్ పాల ధరలను లీటరుకు రూ.2పెంచినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్)తెలిపింది.

    దీంతో దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో అమూల్ మిల్క్ పౌచ్ ధర లీటరుకు రూ.2పెరగనుంది.

    GCMMF అమూల్ బ్రాండ్ క్రింద పాలు,పాల ఉత్పత్తులను మార్కెట్ చేస్తుంది.

    అమూల్ బ్రాండ్‌తో కూడిన అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2చొప్పున పెంచినట్లు జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా తెలిపారు.

    GCNMF చివరిసారిగా ఫిబ్రవరి 2023లో పాల ధరను పెంచింది.రైతులు తమ పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేసేందుకు ఈ పెంపుదల అవసరమని మెహతా అన్నారు.

    Details 

    పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలు పెంపు 

    తాజా పెంపుతో, 500 ml అమూల్ బఫెలో దూద్, 500 ml అమూల్ గోల్డ్ దూద్, 500 ml అమూల్ శక్తి దూద్ వంటి పాల ధరలు వరుసగా రూ.36, రూ.33, రూ.30గా ఉన్నాయి.

    లీటరుకు రూ.2 పెరగడం వల్ల ఎంఆర్‌పి 3-4 శాతం పెరిగిందని, ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువగా ఉందని జిసిఎంఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

    అమూల్ ఫిబ్రవరి 2023 నుండి కీలక మార్కెట్లలో తాజా పౌచ్ పాల ధరలను పెంచలేదని గమనించాలి. మొత్తం నిర్వహణ వ్యయం, పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలు పెంచుతున్నారు.

    Details 

    80 పైసలు ఉత్పత్తిదారులకు

    GCMMF ప్రకారం,అమూల్ ఒక పాలసీగా పాలు, పాల ఉత్పత్తుల కోసం వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను ఉత్పత్తిదారులకు చెల్లిస్తుంది.

    ధరల సవరణ మన పాల ఉత్పత్తిదారులకు లాభదాయకమైన పాల ధరలను నిర్వహించడంలో సహాయపడుతుందని,మరింత పాలను ఉత్పత్తి చేయడానికి వారిని ప్రోత్సహిస్తుందని, ప్రకటన పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Cockroaches and Lizards: బొద్దింకలు, బల్లుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఐతే ఈ సులభమైన పద్ధతితో చెక్ పెట్టండి..! జీవనశైలి
    Amazon Prime Video: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు వద్దనుకుంటే.. అదనపు చార్జ్ తప్పదు! అమెజాన్ ప్రైమ్

    గుజరాత్

    గుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి  గుండెపోటు
    Mass suicide in Gujarat: గుజరాత్‌లో ఘోరం.. ఒకే కుటంబంలో ఏడుగురు ఆత్మహత్య ఆత్మహత్య
    Misappropriation of funds: గుజరాత్ పోలీసులకు సహకరించాలని తీస్తా సెతల్వాద్‌,ఆనంద్ ను ఆదేశించిన సుప్రీంకోర్టు   భారతదేశం
    Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం  దీపావళి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025