తదుపరి వార్తా కథనం

Pegatron: 5జీ స్మాల్ సెల్స్ ఉత్పత్తికి చెన్నైలో మరో పెగాట్రాన్ ప్లాంట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 11, 2025
09:57 am
ఈ వార్తాకథనం ఏంటి
తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం పెగాట్రాన్, చెన్నైలో మరో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుందని ప్రకటించింది. భారత్లో ప్రైవేట్ నెట్వర్క్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటంతో, ఈ ప్లాంట్ను 5జీ స్మాల్ సెల్స్ ఉత్పత్తికి వినియోగించనున్నారు. ఈ ప్లాంట్ నుండి ఉత్పత్తి అయ్యే సామాగ్రిని ఐరోపా, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా మార్కెట్లకు ఎగుమతించనున్నారు. భారత టెలికాం తయారీ వ్యవస్థలో తమ తదుపరి పెట్టుబడులను ఈ ప్లాంట్ ద్వారా ప్రారంభిస్తున్నట్టు పెగాట్రాన్ ఇండియా కంట్రీ మేనేజర్ జయంత్ మోఘే తెలిపారు. కొత్త ప్లాంట్ భారత్ను అంతర్జాతీయ స్థాయి తయారీ మరియు డిజైన్ హబ్గా ఎదగడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.