Page Loader
Apple: భారత్‌లో తయారైన ఐఫోన్లు దాదాపు మొత్తం అమెరికా మార్కెట్‌కే..!
భారత్‌లో తయారైన ఐఫోన్లు దాదాపు మొత్తం అమెరికా మార్కెట్‌కే..!

Apple: భారత్‌లో తయారైన ఐఫోన్లు దాదాపు మొత్తం అమెరికా మార్కెట్‌కే..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌ విధానాల కారణంగా, అమెరికా మార్కెట్‌లో భారత్‌లో తయారయ్యే ఆపిల్‌ ఫోన్లు ప్రముఖ స్థానాన్ని సంపాదించనున్నాయి. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికం నాటికి, భారత్‌లోని ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ ఫ్యాక్టరీల ద్వారా కనీసం 12 నుండి 14 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ త్రైమాసికం తరువాత కూడా ఇదే స్థాయిలో ఎగుమతులు కొనసాగిస్తే, 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 40 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేయడం జరుగుతుంది. మన దేశంలో తయారయ్యే 100 ఐఫోన్లలో 80 ఫోన్లు అమెరికాకే చేరుతాయి.

వివరాలు 

జూన్‌ త్రైమాసికంలో అమ్మకానికి వచ్చే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారత్‌లో తయారైనవే..

"2024లో జూన్‌ త్రైమాసికంలో దాదాపు 1.1 కోట్ల ఐఫోన్లు విక్రయించాం. అంటే సగటున ఒక ఐఫోన్‌ ధర 1,100 బిలియన్‌ డాలర్లుగా తీసుకుంటే, మొత్తం విలువ 12.1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. వాస్తవానికి యాపిల్‌ ఆ త్రైమాసికంలో అతితక్కువ విక్రయాలు చేసింది. ఈసారి 12 బిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువ విక్రయాలు జరగవచ్చు. భారత మార్కెట్లో ఐఫోన్ల డిమాండ్‌ మరింత పెరుగుతోంది" అని ఒక నిపుణుడు తెలిపారు. అలాగే,ఇటీవల యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ కూడా ఈ విషయం వెల్లడించారు. జూన్‌ త్రైమాసికంలో అమ్మకానికి వచ్చే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారత్‌లో తయారైనవే ఉంటాయని చెప్పారు. అయితే, ఐపాడ్స్‌,మ్యాక్‌బుక్‌,యాపిల్‌ వాచ్‌లు,ఎయిర్‌పాడ్స్‌ వంటి ఉత్పత్తులను వియత్నాంలో తయారుచేసి, అవి అమెరికాకు దిగుమతి చేసుకుంటామని చెప్పారు.

వివరాలు 

టాటా ఎలక్ట్రానిక్స్‌,ఫాక్స్‌కాన్‌ ఇప్పటికే తమ ఫ్యాక్టరీలు ప్రారంభించి ఉత్పత్తి పెంచుతున్నాయి

ఇప్పటి వరకు, భారత్‌లో తయారైన ఐఫోన్లు యూకే, తుర్కియే, జపాన్‌ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు, ఈ దేశాలను రీ-రూట్‌ చేస్తూ, భారత్‌ నుంచి వచ్చే ఐఫోన్లను అమెరికాకు పంపేందుకు మళ్లీ వ్యూహాలు రూపోందించబడ్డాయి. తద్వారా, యాపిల్‌ భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 22 బిలియన్‌ డాలర్ల నుంచి గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. ఈ మార్పులను చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్‌,ఫాక్స్‌కాన్‌ ఇప్పటికే తమ ఫ్యాక్టరీలు ప్రారంభించి ఉత్పత్తి పెంచుతున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్‌ హోసుర్‌ ఫ్యాక్టరీ ప్రస్తుతం పాత తరం ఐఫోన్ల అసెంబ్లీని ప్రారంభించింది.

వివరాలు 

ఫిబ్రవరిలో 84 శాతం ఐఫోన్లు అమెరికాకు

ఇక ఫాక్స్‌కాన్‌ న్యూబెంగళూరులో 2.8 బిలియన్‌ డాలర్లతో ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీ కూడా త్వరలోనే పనిచేయడం ప్రారంభించబోతోంది. ఇది చైనా బయటికివెళ్ళిన అతిపెద్ద ఐఫోన్‌ తయారీ కేంద్రం అవుతుంది.గత ఏడాది భారత్‌ 4 నుండి 4.5 కోట్ల ఐఫోన్లను తయారుచేసింది,ఇవి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం విక్రయాల్లో 20 శాతంగా ఉంటాయి. ఇక్కడ తయారైన ఐఫోన్లలో 1.5 కోట్లకు పైగా అమెరికాకు, 1.3 కోట్లను ఇతర విదేశీ మార్కెట్లకు, 1.2 కోట్లను దేశీయ మార్కెట్లో విక్రయించారు. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ప్రకారం, మార్చి నెలలో తయారైన 98 శాతం ఐఫోన్లు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. వీటి సంఖ్య 31 లక్షలకు పైగా ఉంది. అదే ఫిబ్రవరిలో 84 శాతం ఐఫోన్లు అమెరికాకు పంపబడ్డాయి.