NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ArcelorMittal: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌.. రూ.1,61,198 కోట్లు!
    తదుపరి వార్తా కథనం
    ArcelorMittal: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌.. రూ.1,61,198 కోట్లు!
    ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌.. రూ.1,61,198 కోట్లు!

    ArcelorMittal: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌.. రూ.1,61,198 కోట్లు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 05, 2024
    08:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉక్కు పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఆర్సెలార్ మిత్తల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌తో కలిసి స్థాపించనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (ఐఎస్‌పీ) ప్రతిపాదనకు బుధవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది.

    ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేస్తున్నారు.

    ఈ ప్రాజెక్టులో పెట్టుబడి మొత్తం రూ.1,61,198 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 63 వేల మందికి ఉపాధి కల్పించబడుతుందని ప్రణాళికలు వెల్లడించాయి.

    వివరాలు 

    మొదటి దశ: రూ.70 వేల కోట్ల పెట్టుబడి 

    ప్రాజెక్ట్ మొదటి దశలో నాలుగేళ్ల వ్యవధిలో రూ.70 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్నారు.

    ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఈ దశలో సుమారు 20,000 మందికి ఉపాధి కల్పించబడుతుంది. ఈ దశ పనులు 2029 జనవరికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

    భూమి కేటాయింపు

    సంస్థ అందించిన ప్రీ-ఫీజిబులిటీ రిపోర్టు ఆధారంగా నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీకి చెందిన 2,164.31 ఎకరాల భూమి ప్రభుత్వం గుర్తించింది.

    బుచ్చయ్యపేట, చందనాడ, డీఎల్‌పురం, రాజయ్యపేట, వేంపాడ వంటి ప్రాంతాల్లో ఈ భూములు కేటాయించారు.

    వివరాలు 

    రెండో దశ: రూ.80 వేల కోట్ల పెట్టుబడి 

    రెండో దశలో రూ.80 వేల కోట్లతో ఉక్కు కర్మాగారం పనులను కొనసాగిస్తారు. ఈ దశలో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 24 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుంది.

    ఈ పనులు 2033 నాటికి పూర్తి చేసి, అదనంగా 35 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.

    ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యాలు

    దేశీయ ఉక్కు ఉత్పత్తిలో 20 శాతం వాటాను సాధించాలని ప్రణాళిక చేశారు. 2035 నాటికి 40 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యం.

    ప్రస్తుతం 9.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేయగా, కొత్త పరిశ్రమతో 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.

    వివరాలు 

    కో-టెర్మినస్ పోర్ట్ అభివృద్ధి 

    నక్కపల్లి వద్ద కో-టెర్మినస్ పోర్ట్ ఆధారిత క్లస్టర్ ఏర్పాటుకు అనువుగా ఉన్న భూములను పరిశీలించినట్లు తెలిపారు.

    మిత్తల్‌ సంస్థ తన ఉక్కు కర్మాగారానికి అనుసంధానంగా కో-టెర్మినస్‌ క్యాప్టివ్‌ పోర్టును రెండు దశల్లో అభివృద్ధి చేసేందుకు రూ.11,198 కోట్లు వెచ్చించనున్నది.

    మొదటి దశలో పోర్టు నిర్మాణానికి రూ.5,816 కోట్లను వెచ్చించనుండగా, ఈ ప్రాజెక్ట్ ద్వారా 3,000 మందికి ఉపాధి లభిస్తుంది.

    మొదటి దశలో మొత్తం 5 బెర్తులను అభివృద్ధి చేయనున్నారు, వీటి పొడవు 1.5 కి.మీ.గా ఉంటుంది.

    దీని ద్వారా ప్రతి సంవత్సరం 20.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఎగుమతులు, దిగుమతులు నిర్వహించనున్నారు.

    ఈ దశ కోసం 150 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ ప్రభుత్వం వద్ద ప్రతిపాదించింది.

    వివరాలు 

    రెండో దశలో పోర్టు విస్తరణకు రూ.5,382 కోట్లు

    రెండో దశలో పోర్టు విస్తరణకు రూ.5,382 కోట్లు వెచ్చించాలని సంస్థ పేర్కొంది. ఈ దశలో అదనంగా 12 బెర్తులను నిర్మించేందుకు 170 ఎకరాల భూమి అవసరమని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.

    దీంతో ప్రతి సంవత్సరం అదనంగా 28.99 మిలియన్‌ టన్నుల రవాణా సామర్థ్యం పెరుగుతుందని, ఈ విస్తరణ దశలో మరో 5,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర భారతదేశం
    Cyclone Dana: 'దానా' తుఫాన్ ఎఫెక్టు.. ఆంధ్ర, ఒడిశా, బెంగాల్‌కు ఐఎండీ అలర్ట్ తుపాను
    Orvakal: ఓర్వకల్లులో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు గల కారణాలు ఏమిటి . .అక్కడే ఎందుకు?  భారతదేశం
    AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025