NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / India's Manufacturing Sector Surges: తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్.. హెచ్‌ఎస్‌డీసీ నివేదిక 
    తదుపరి వార్తా కథనం
    India's Manufacturing Sector Surges: తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్.. హెచ్‌ఎస్‌డీసీ నివేదిక 
    తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్.. హెచ్‌ఎస్‌డీసీ నివేదిక

    India's Manufacturing Sector Surges: తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్.. హెచ్‌ఎస్‌డీసీ నివేదిక 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 04, 2024
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా తయారీ రంగంలో తన ప్రాధాన్యతను గర్వంగా ప్రదర్శించేది, కానీ ఇప్పుడు అది కాస్త వెనుకబడింది.

    ఒకవైపు చైనాకు ఆర్థిక వృద్ధి నెమ్మదిగా సాగుతోంది, ఇంకోవైపు భారత్‌కు శుభవార్తలు వినిపిస్తున్నాయి.

    హెచ్‌ఎస్‌డీసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారత్ తయారీ రంగం అక్టోబర్‌లో విస్తరించిందని తెలిపింది. ఈ క్రమంలో భారత్ చైనాను అధిగమించిందని నివేదిక సూచిస్తోంది.

    వివరాలు 

    అక్టోబర్‌లో భారతదేశం ఎదుర్కొన్న సవాళ్లు 

    ఇందుకు ప్రధాన కారణం విదేశాల్లో భారత వస్తువులకు పెరిగిన డిమాండ్. భారతదేశం ప్రపంచంలో అనేక దేశాల నుంచి కొత్త ఆర్డర్‌లను పొందడమే కాకుండా, అమ్మకాలు కూడా పెరిగాయి.

    ఈ పెరుగుదలతో అక్టోబర్‌లో ఉద్యోగాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, అమెరికా వంటి దేశాల నుంచి భారత్ మరిన్ని ఆర్డర్‌లను అందుకుంది. ఈ నేపథ్యంలో, తయారీ రంగం ఊపందుకుంది.

    భారతదేశం పురోగతి సాధించిందా?

    అక్టోబర్‌లో భారత్ మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.5 పాయింట్లకు చేరింది.

    సెప్టెంబర్‌లో ఇది 56.5 పాయింట్లుగా ఉంది. పెరుగుతున్న పీఎంఐ ఆపరేటింగ్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని హెచ్‌ఎస్‌డీసీ నివేదిక స్పష్టం చేస్తోంది.

    వివరాలు 

    భారతదేశంలో తయారయ్యే వస్తువులకు డిమాండ్ 

    మరోవైపు, చైనా పీఎంఐ 50.30 పాయింట్ల వద్ద ఉంది. అక్టోబర్‌లో చైనాకు కొంత పెరుగుదల కనిపించినప్పటికీ, భారత్‌కు సమానం కావడం లేదు.

    ఇటీవలి కాలంలో, భారతదేశంలో తయారైన వస్తువుల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అనేక విదేశీ కంపెనీలు భారీ సంఖ్యలో ఆర్డర్లు బుక్ చేసుకున్నాయి.

    ప్రస్తుతం ఆర్డర్‌ల సంఖ్య గత 20 సంవత్సరాలలో వచ్చిన సగటు సంఖ్యను మించిపోయింది.

    కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, విజయవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలు వస్తువుల అమ్మకాలను పెంచడంలో ఎంతో సహాయపడినట్టు నివేదికలో పేర్కొనబడింది.

    వివరాలు 

    ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది 

    డిమాండ్ పెరగడంతో, ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగింది, అంటే ఉపాధి అవకాశాలు అతి వేగంగా పెరిగాయి.

    తాజా డేటా ప్రకారం, తయారీదారులు అక్టోబర్‌లో అదనపు ఉద్యోగులను నియమించారు, ఇది సెప్టెంబరులో కొత్తగా తీసుకున్న ఉద్యోగుల సంఖ్య కంటే ఎక్కువ. అక్టోబర్ డేటా సేకరణ గత 20 సంవత్సరాలలో అత్యధికంగా ఉంది.

    భవిష్యత్ ఉత్పత్తి వాల్యూమ్‌ల గురించి భారతీయ తయారీదారులు మరింత ఆశాజనకంగా మారారు అని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక చెబుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    చైనా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    NSG New Chief: ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ బీ శ్రీనివాసన్ నియామకం భారతదేశం
    IMA On Doctors Safety: భారతదేశంలో నైట్ షిఫ్ట్‌లో 35% మంది వైద్యులు అసురక్షితం.. ఐఎంఏ  అధ్యయనంలో కీలక విషయాలు.. భారతదేశం
    #Newsbytesexplainer: ఉచిత పథకాలు రాష్ట్రాల ఖజానాకు గండి పెడుతున్నాయా.. ఇది తెలుసుకోవడం చాల ముఖ్యం భారతదేశం
    Helicopter:హెలికాప్టర్ సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు  భారతదేశం

    చైనా

    Xiaomi: కొత్త అటానమస్ స్మార్ట్ ఫ్యాక్టరీ ఆవిష్కరణ..సంవత్సరానికి 1 మిలియన్ ఫోన్ల ఉత్పత్తి ఫోన్
    China develops : చంద్రునిపై తొలి వ్యోమగామి..టెక్ ర్యాట్ రేస్, చైనా కృషి నాసా
    China: చైనా క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను అనుకున్నదానికంటే 6 సంవత్సరాల ముందుగానే ఛేదించింది టెక్నాలజీ
    China: చైనీస్ పరిశోధకులు రూపొందించిన  నాలుగు గ్రాముల డ్రోన్‌.. అది ఎప్పటికీ ఎగురుతుంది  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025