
Pirce hike:అజిత్రోమైసిన్,ఇబుప్రోఫెన్ సహా 900 ఔషధాల ధరలు పెరిగాయి
ఈ వార్తాకథనం ఏంటి
భారత వినియోగదారులకు మరో షాక్ తగిలింది. నిత్యం ఉపయోగించే అజిత్రోమైసిన్, ఐబుప్రోఫెన్ వంటి ఔషధాలతో పాటు 900 అత్యవసర మందుల ధరలు పెరిగాయి.
1.74% పెంచినట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ప్రకటించింది.
ఈ పెంపు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి రానుంది.
క్రిటికల్ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, డయాబెటిస్ మందులపై ప్రభావం
తాజాగా పెరిగిన ఔషధాల జాబితాలో క్రిటికల్ ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ కు సంబంధించిన మందులు కూడా ఉన్నాయి. ఇది సాధారణ ప్రజలకు ఆర్థిక భారం కావచ్చు.
వివరాలు
ధరల పెంపు ఎలా నిర్ణయించబడింది?
డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఆర్డర్, 2013 (DPCO, 2013) నిబంధనల ప్రకారం, షెడ్యూల్డ్ ఔషధాల గరిష్ట ధరలను టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా ప్రతీ సంవత్సరం సమీక్షిస్తారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్డ్ మందుల గరిష్ట ధరలను 1.4.2024 నుంచి 0.00551% పెంచారు.
DPCO 2013 పరిపత్రం 2(1)(యూ) ప్రకారం కొత్త ఔషధాల రిటైల్ ధరను NPPA నిర్ణయిస్తుంది.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంగా దీన్ని వెల్లడించారు.
2023తో పోలిస్తే, 2024లో WPI మార్పు +1.74028% గా ఉందని రెగ్యులేటర్ తెలిపింది.
వివరాలు
పెరిగిన మందుల ధరలు
యాంటీబయాటిక్స్: అజిత్రోమైసిన్ (250mg): ₹11.87 అజిత్రోమైసిన్ (500mg): ₹23.98 అమోక్సిసిలిన్ + క్లావులానిక్ ఆసిడ్ (డ్రై సిరప్): MLకి ₹2.09 పెంపు
పెయిన్ కిల్లర్స్: డైక్లోఫెనాక్ (పెయిన్ కిల్లర్): టాబ్లెట్కు ₹2.09 ఇబుప్రోఫెన్ (పెయిన్ కిల్లర్) 200mg: టాబ్లెట్కు ₹0.72 400mg: టాబ్లెట్కు ₹1.22
డయాబెటిస్ మెడిసిన్స్: డాపాగ్లిఫ్లోజిన్ + మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ + గ్లిమెపిరైడ్: టాబ్లెట్కు ₹12.74
యాంటీవైరల్ మందులు: అసైక్లోవిర్ 200mg: టాబ్లెట్కు ₹7.74 400mg: టాబ్లెట్కు ₹13.90 యాంటీ మలేరియా మందులు: హైడ్రాక్సీ క్లోరోక్విన్ 200mg: టాబ్లెట్కు ₹6.47 400mg: టాబ్లెట్కు ₹14.04
వివరాలు
ఔషధ తయారీదారులకు ఊరట!
ఔషధ తయారీదారులు WPI ఆధారంగా ఫార్ములేషన్ల గరిష్ట రిటైల్ ధరలను పెంచవచ్చు.
దీని కోసం కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదు.
ఎన్సీపీఏ & ఔషధ ధరల సమీక్ష
ఎన్సీపీఏ (NPPA) టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా ప్రతి ఏడాది నిత్యావసర మందుల ధరలను సమీక్షిస్తుంది.
నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) కింద ఈ మందుల ధరల నియంత్రణ జరుగుతుంది.
ఈ పెరుగుదల సాధారణ ప్రజలకు భారం అవుతుందా లేక పరిశ్రమకు మేలు చేస్తుందా అన్నది చూడాలి!