NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Bharti Airtel: డిజిటల్ టీవీ సెగ్మెంట్‌లో భారతీ ఎయిర్‌టెల్ దూకుడు.. టాటా ప్లేని కొనుగోలు చేసేందుకు చర్చలు
    తదుపరి వార్తా కథనం
    Bharti Airtel: డిజిటల్ టీవీ సెగ్మెంట్‌లో భారతీ ఎయిర్‌టెల్ దూకుడు.. టాటా ప్లేని కొనుగోలు చేసేందుకు చర్చలు
    డిజిటల్ టీవీ సెగ్మెంట్‌లో భారతీ ఎయిర్‌టెల్ దూకుడు

    Bharti Airtel: డిజిటల్ టీవీ సెగ్మెంట్‌లో భారతీ ఎయిర్‌టెల్ దూకుడు.. టాటా ప్లేని కొనుగోలు చేసేందుకు చర్చలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 08, 2024
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌ టెల్ తన డిజిటల్ టీవీ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.

    ఇందులో భాగంగా దేశంలో అతిపెద్ద డైరెక్ట్‌ టు హోమ్‌ (DTH) సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లేని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంది.

    ఈ క్రమంలోనే టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతోందని 'ఎకనామిక్‌ టైమ్స్‌' వెల్లడించింది.

    ఓవర్‌-ది-టాప్‌ (OTT)స్ట్రీమింగ్‌ సేవలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ తన డిజిటల్ టీవీ విభాగాన్ని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో టాటా ప్లేని కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

    ఈ ఒప్పందం కుదిరితే,టాటా తన కంటెంట్,ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యకలాపాల నుంచి వైదొలగాల్సి ఉంటుంది.

    2017లో టాటా తన మొబిలిటీ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు విక్రయించిన తర్వాత,ఇది రెండో పెద్ద ఒప్పందంగా నిలుస్తుంది.

    వివరాలు 

    డీటీహెచ్‌కు బదులుగా హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్,ఓటీటీ ప్యాకేజీ

    ప్రస్తుతం టాటా ప్లే 20.77 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో, 32.7 శాతం మార్కెట్ వాటాతో DTH విభాగంలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తోంది.

    కానీ, 2024 ఆర్థిక సంవత్సరంలో టాటా ప్లేకి రూ.353.8 కోట్ల నష్టం వచ్చింది.

    మరోవైపు, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ విభాగం కూడా నష్టాలనే ఎదుర్కొంటూ, సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ 27.8 శాతం మార్కెట్ వాటా సాధించింది.

    టాటా ప్లే కొనుగోలు చేయడం వల్ల ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్ పెరుగుతుందని, జియో వంటి సంస్థలతో పోటీపడే శక్తి పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

    అలాగే, టైర్‌-1, టైర్‌-2 నగరాల వినియోగదారులు డీటీహెచ్‌కు బదులుగా హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్, ఓటీటీ ప్యాకేజీలను ఎంచుకుంటున్నారు.

    గ్రామీణ ప్రాంతాల్లో దూరదర్శన్‌ ఫ్రీ డిష్‌ ప్రాధాన్యత పెరుగుతుందనే నివేదికలు కూడా ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ టెల్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    ఎయిర్ టెల్

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ ఇండియా
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025