LOADING...
Union Budget 2026: రేపే బడ్జెట్ ప్రకటన.. స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా?
రేపు బడ్జెట్ ప్రకటన.. స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా?

Union Budget 2026: రేపే బడ్జెట్ ప్రకటన.. స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా ఆదివారం స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి. కానీ ఈసారి బడ్జెట్ ప్రకటించనున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం NSE, BSE, కమోడిటీ మార్కెట్లు పూర్తి స్థాయిలో ట్రేడింగ్‌ నిర్వహించనుండగా, ఇన్వెస్టర్లు బడ్జెట్ నిర్ణయాలపై వెంటనే స్పందించేందుకు అవకాశం పొందుతున్నారు. నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం చేస్తారు. తరువాత బడ్జెట్ పత్రాలు లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టబడతాయి. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ పూర్తిగా ఆహ్లాదకరంగా కొనసాగుతుంది.

Details

ట్రేడింగ్ సెషన్ వివరాలు

ప్రీ-ఓపెన్ సెషన్: ఉదయం 9:00 - 9:08 నార్మల్ ట్రేడింగ్: ఉదయం 9:15 - మధ్యాహ్నం 3:30 బ్లాక్ డీల్ సెషన్ 1: ఉదయం 8:45 - 9:00 బ్లాక్ డీల్ సెషన్ 2: మధ్యాహ్నం 2:05 - 2:20 IPO మరియు ప్రత్యేక సెషన్లు: ఉదయం 9:00 - 9:45 మార్కెట్ ముగిసిన తర్వాత సెషన్: మధ్యాహ్నం 3:40 - 4:00

Details

సెటిల్మెంట్, ఇతర నియమాలు

ఆదివారం చేసిన ట్రేడింగ్ సెటిల్మెంట్ సోమవారం (ఫిబ్రవరి 2) జరుగుతుంది. డబ్బు విత్ డ్రా కోసం రిక్వెస్ట్ చేసుకున్నా, అది సోమవారం బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. జనవరి 30న కొన్న షేర్లను ఆదివారం అమ్మడం సాధ్యం కాదు; సోమవారం నుంచి మాత్రమే అమ్మకం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా బడ్జెట్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లతో ట్రేడింగ్ కొనసాగించనుంది. మొత్తం మీద, 2026 బడ్జెట్ ప్రకటనకు సమకాలీనంగా మార్కెట్లు ఆదివారం పని చేయడం ఇన్వెస్టర్లకు ప్రత్యక్ష మార్కెట్ ప్రతిస్పందనకు అవకాశం కల్పిస్తుంది.

Advertisement