
Hydro Projects: 13 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీఈఏ భారీ ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) ఇటీవల 2024-25 సంవత్సరానికి సంబంధించిన 6 హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల (PSPs) సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPRs) ఆమోదించింది.
మొత్తం 7.50 గిగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నాయి.
విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం, ఈ విభాగంలో ప్రైవేట్ రంగం నుండి ఆసక్తికరమైన భాగస్వామ్యం కనిపిస్తోంది.
తద్వారా హైడ్రో-పంప్డ్ స్టోరేజ్ రంగం మరింత అభివృద్ధి చెందుతున్నట్టు స్పష్టమవుతోంది.
Details
నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక
మరోవైపు 2025-26లో మొత్తం 22 గిగావాట్ల సామర్థ్యం గల 13 కొత్త PSP ప్రాజెక్టులను ఏర్పాటుచేయాలని కేంద్ర విద్యుత్ సంస్థ ఫ్రణాళిక సిద్ధం చేసిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ ప్రాజెక్టులలో చాలా వరకు నాలుగేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా, 2030 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తిగా ప్రారంభమవాలని అంచనా వేస్తున్నారు.
ఇలా ప్రైవేట్ రంగం ప్రోత్సాహంతో కూడిన ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో శక్తి నిల్వల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.