LOADING...
Centre: బంగారం,వెండి దిగుమతులకు 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి
బంగారం,వెండి దిగుమతులకు 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి

Centre: బంగారం,వెండి దిగుమతులకు 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో బంగారం,వెండి దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి మొత్తం 15 బ్యాంకులకు ఈ లోహాల దిగుమతికి అనుమతి మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అనుమతి 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చి 2029 మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఇక యూనియన్‌ బ్యాంక్‌, స్బెర్‌ బ్యాంకులకు మాత్రం ప్రత్యేకంగా కేవలం బంగారం దిగుమతి చేసుకునే అనుమతి మాత్రమే ఇచ్చింది. వెండి దిగుమతికి వీటికి అనుమతి లేదు.

వివరాలు 

అనుమతి పొందిన బ్యాంకుల జాబితా ఇదే.. 

ఈ అనుమతి పొందిన బ్యాంకుల జాబితాలో యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, డాయిష్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యెస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ఉన్నాయి. ఇంతకుముందు దేశీయ బ్యాంకులు బంగారం, వెండి దిగుమతులను నిలిపివేశాయనే వార్తలు వినిపించాయి. ఇందుకు కారణంగా ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడమేనని సమాచారం. ఈ పరిస్థితిలో టన్నుల కొద్దీ లోహాలకు సుంకాల అనుమతులు లభించక నిలిచిపోయినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

వివరాలు 

మూడేళ్లపాటు దిగుమతులకు అనుమతి

ఇటీవల 2025 ఏప్రిల్‌లో చివరిసారిగా ప్రభుత్వం దిగుమతులకు అనుమతి ఇచ్చింది. అయితే ఆ అనుమతి 2026 మార్చి 31తో ముగిసింది. కొత్త ఉత్తర్వుల కోసం బ్యాంకులు ఎదురుచూస్తున్న సమయంలో, మళ్లీ మూడేళ్లపాటు దిగుమతులకు అనుమతి ఇస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement