NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market:నష్టాల్లో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. 22,400 దిగువకు నిఫ్టీ.. 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 
    తదుపరి వార్తా కథనం
    Stock market:నష్టాల్లో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. 22,400 దిగువకు నిఫ్టీ.. 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 
    22,400 దిగువకు నిఫ్టీ.. 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

    Stock market:నష్టాల్లో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. 22,400 దిగువకు నిఫ్టీ.. 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2025
    04:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఆ లాభాలను కోల్పోయాయి.

    హోలీ సందర్భంగా శుక్రవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ఉండటంతో, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

    ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలు ప్రపంచ మార్కెట్లను వెంటాడుతున్నాయి.

    ఈ నేపథ్యంలో, కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనుకంజ వేశారని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

    దీని ప్రభావంతో, సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు నష్టపోగా, నిఫ్టీ 22,400 దిగువన వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.

    వివరాలు 

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $70

    సెన్సెక్స్ ఉదయం 74,392.54 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై, ఇంట్రాడేలో 74,401 గరిష్ఠాన్ని తాకింది.

    కానీ అమ్మకాలతో సూచీలు నష్టాల్లోకి జారుకుని, చివరకు 200.85 పాయింట్ల నష్టంతో 73,828.91 వద్ద ముగిసింది.

    నిఫ్టీ కూడా 73.30 పాయింట్ల నష్టంతో 22,397.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 87గా ఉంది.

    సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $70 వద్ద, బంగారం ఔన్సు $2953 వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం తెలంగాణ
    Operation Sindoor: భారత్‌-పాక్‌ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోబొం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అమెరికా

    స్టాక్ మార్కెట్

    Stock Market : బేర్ పట్టు నుంచి కాస్త విరామం .. స్వల్ప లాభాలలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 22,959 బిజినెస్
    Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 29 పాయింట్లు, నిఫ్టీ 14 పాయింట్ల నష్టం  బిజినెస్
    Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు..  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025