NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Cognizant: రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ధిక్కరించినందుకు ఉద్యోగులకు దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ 
    తదుపరి వార్తా కథనం
    Cognizant: రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ధిక్కరించినందుకు ఉద్యోగులకు దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ 
    రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ధిక్కరించినందుకు ఉద్యోగులకు దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్

    Cognizant: రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ధిక్కరించినందుకు ఉద్యోగులకు దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2024
    01:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాస్‌డాక్-లిస్టెడ్ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.

    పదేపదే రిమైండర్‌ల తర్వాత కూడా ఆఫీసుకు రాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినట్లు లైవ్‌మింట్ నివేదించింది.

    ఏప్రిల్ 15న ఉద్యోగులకు లేఖ రాసింది. హెచ్చరికలు జారీ చేసిన ఆఫీసులకు రాని వారిపై నిఘా పెట్టింది.

    మార్గదర్శకాల్ని లెక్కచేయని వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొంది.

    ఇప్పటికైనా ఆఫీసుకు వస్తే సరే అని లేకపోతే లేఆఫ్స్ చేస్తామని హెచ్చరించింది.

    "కంపెనీ నియమ నిబంధనలు, పాటించని వారు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడినట్లే పరిగణించాల్సి వస్తుంది. తదనుగుణంగా వారిపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఇది తొలగింపుకు దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో నివేదిక పేర్కొంది.

    Details 

    2,54,000 మంది కాగ్నిజెంట్ ఉద్యోగులు భారతదేశంలోనే..

    ఫిబ్రవరిలో, వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, IT సంస్థ భారతదేశంలోని తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయమని కోరింది.

    ఈ మేరకు అప్పట్లోనే కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఉద్యోగులకు ఇచ్చిన ఒక మెమోలో పేర్కొన్నారు.

    కానీ వీటిని ఉద్యోగులు పెద్దగా పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగ్నిజెంట్ లో మొత్తం 3,47,700 మంది ఉద్యోగులు ఉండగా.. దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉండడం విశేషం.

    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా 2023 చివర్లోనే వారి ఉద్యోగులను .. ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి.

    TCS వారానికి ఐదు రోజుల షెడ్యూల్‌ను రూపొందించింది.

    Details 

    మొదటి ఆర్థిక సంవత్సరం ఫలితాల్ని ప్రకటించిన కాగ్నిజెంట్

    ఇక ఇటీవల కాగ్నిజెంట్ ఈ క్యాలెండర్ ఏడాది మొదటి ఆర్థిక సంవత్సరం ఫలితాల్ని ప్రకటించింది.

    కాగ్నిజెంట్ అట్రిషన్ రేటు 10 శాతం పాయింట్లు తగ్గి 12 నెలల ప్రాతిపదికన 13.1 శాతానికి చేరుకుంది.

    మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో దీని వినియోగ రేటు 1 శాతం పెరిగి 82 శాతానికి చేరుకుంది.

    కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (CTS) క్లయింట్లు విచక్షణతో ఖర్చు చేయడం వల్ల ఆదాయంలో సంవత్సరానికి (YoY) 1.1 శాతం పడిపోయి $4.8 బిలియన్లకు చేరుకుంది.

    ఇతర చాలా ఐటీ కంపెనీల్లో కూడా ఉద్యోగుల సంఖ్య ఇదే స్థాయిలో పడిపోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025