LOADING...
Stock Market: మార్కెట్లలో మళ్లీ జోష్.. ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు పెరగడానికి 5 కారణాలు
మార్కెట్లలో మళ్లీ జోష్.. ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు పెరగడానికి 5 కారణాలు

Stock Market: మార్కెట్లలో మళ్లీ జోష్.. ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు పెరగడానికి 5 కారణాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో దూసుకెళ్లాయి. నిఫ్టీ 24,000 స్థాయికి చేరువ కాగా.. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మరింత బలంగా రాణించాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొంత తగ్గడం, దేశీయ పెట్టుబడులు స్థిరంగా కొనసాగడం, గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరగడం మార్కెట్లకు ఊతమిచ్చాయి. గత కొద్ది నెలలుగా విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు, మార్కెట్‌లో నెగెటివ్ సెంటిమెంట్, అధిక వాల్యుయేషన్ల భయాలతో ఒత్తిడిలో ఉన్న మార్కెట్లు ఇప్పుడు మళ్లీ కోలుకుంటున్నాయి. దీంతో 'మార్కెట్లలో చెడు రోజులు ముగిశాయా?' అనే చర్చ దలాల్ స్ట్రీట్‌లో జోరుగా సాగుతోంది.

వివరాలు 

దేశీయ లిక్విడిటీ మార్కెట్లకు పెద్ద బలం

భారతీయ ఈక్విటీ మార్కెట్లకు ప్రస్తుతం అతిపెద్ద మద్దతు దేశీయ పెట్టుబడులే. గత రెండేళ్లుగా మార్కెట్ రాబడులు ఆశించిన స్థాయిలో లేకపోయినా.. SIPల ద్వారా వచ్చే పెట్టుబడులు తగ్గలేదు. అలాగే EPFO, రిటైర్మెంట్ ఫండ్స్ నుంచి కూడా నిరంతరం ఈక్విటీల్లో డబ్బు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేసినా మార్కెట్ పెద్దగా కుప్పకూలకుండా నిలబడగలిగింది.

వివరాలు 

పానిక్ సెల్లింగ్ దశ ముగిసినట్టేనా..?

మార్చి-ఏప్రిల్ నాటికి మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా బలహీనపడింది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా షేర్లు విక్రయించగా.. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు గట్టిగా పడిపోయాయి. అయితే జియోపాలిటికల్ టెన్షన్స్ కొంత తగ్గడం, క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులోకి రావడంతో ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మార్కెట్‌లో వచ్చిన వేగవంతమైన రికవరీ చూస్తే.. భయాందోళనలతో జరిగిన అమ్మకాలు ఎక్కువగా ముగిసినట్టే కనిపిస్తోంది. కంపెనీల లాభాలు పూర్తిగా దెబ్బతినలేదు ఆదాయ వృద్ధి కొంత మందగించినా.. భారత కంపెనీలు భారీ లాభాల సంక్షోభంలో లేవు. ముఖ్యంగా ఇండస్ట్రియల్స్, పవర్, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, యుటిలిటీస్ రంగాల్లో ఆర్డర్ బుక్స్ బలంగా ఉన్నాయి. పెట్టుబడుల కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్ మరింత లోతైన బేర్ ఫేజ్‌లోకి వెళ్లకుండా నిలబడగలిగింది.

Advertisement

వివరాలు 

గ్లోబల్ మార్కెట్లలో మళ్లీ రిస్క్ తీసుకునే ధోరణి

ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో భయాలు కొంత తగ్గుతున్నాయి. ప్రధాన కేంద్ర బ్యాంకులు భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోతలకు వెళ్లొచ్చన్న అంచనాలు, అమెరికా ఆర్థిక డేటా స్థిరంగా ఉండటం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెద్ద యుద్ధంగా మారవన్న భావన గ్లోబల్ మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్ తీసుకొచ్చాయి. ఈ మార్పుతో భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్లకు కూడా మద్దతు లభిస్తోంది.

Advertisement

వివరాలు 

అయినా కొత్త బుల్‌రన్ మొదలైందని చెప్పలేం

అయితే మార్కెట్లపై అతిగా ఆశావహంగా ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరెక్షన్ వచ్చినా భారతీయ మార్కెట్లు ఇంకా ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే అధిక వాల్యుయేషన్ల వద్దే ట్రేడ్ అవుతున్నాయి. కంపెనీల లాభాల వృద్ధి ఈ స్థాయి విలువలను సమర్థించగలదా అనే సందేహం విదేశీ ఇన్వెస్టర్లలో ఇంకా ఉంది. అలాగే వినియోగం మందగించడం,గ్లోబల్ గ్రోత్ అసమానంగా ఉండటం వంటి రిస్కులు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఇకపై మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు తీసే బుల్‌రన్ కంటే..రంగాలు మారుతూ అవకాశాలు వచ్చే రొటేషనల్ మార్కెట్‌గా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. లిక్విడిటీ బలంగా ఉండటంతో కరెక్షన్లలో కొనుగోళ్లు రావొచ్చు. కానీ రాబడులు మాత్రం అన్నిషేర్లలో కాకుండా ఎంపిక చేసిన రంగాల్లోనే కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement