LOADING...
Unclaimed equities : షేర్లు కొనేసి మర్చిపోయారా..? రూ.89,000 కోట్లు ఇంకా క్లెయిమ్ కాలేదు.. మీది ఉందో చూడండి!
షేర్లు కొనేసి మర్చిపోయారా..? రూ.89,000 కోట్లు ఇంకా క్లెయిమ్ కాలేదు.. మీది ఉందో చూడండి!

Unclaimed equities : షేర్లు కొనేసి మర్చిపోయారా..? రూ.89,000 కోట్లు ఇంకా క్లెయిమ్ కాలేదు.. మీది ఉందో చూడండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో ఎవరూ క్లెయిమ్ చేయని పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి బ్యాంక్ డిపాజిట్లు, ఈక్విటీలు, ఇన్సూరెన్స్ పాలసీలు, ఈపీఎఫ్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్లలో కలిపి మొత్తం రూ.2.2 లక్షల కోట్లకు పైగా అన్‌క్లెయిమ్డ్ సంపద ఉన్నట్లు ఒక ఫైనాన్స్ నివేదిక వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో క్లెయిమ్ చేయని డబ్బు వేగంగా పెరుగుతుండటం గమనార్హం. నివేదిక ప్రకారం షేర్ మార్కెట్‌లోనే రూ.89,000 కోట్లకు పైగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం 1671 కంపెనీల వద్ద ఇన్వెస్టర్ల సొమ్ము అలాగే ఉండిపోయింది. బ్యాంక్ డిపాజిట్ల తర్వాత అన్‌క్లెయిమ్డ్ డబ్బు అత్యధికంగా ఉన్న విభాగం ఇదే. ఈ రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు సాధారణంగా తక్కువ రాబడి ఇచ్చే సేవింగ్స్ కాదు.

వివరాలు

వాటి విలువ తగ్గే అవకాశం

ఇవి అధిక వృద్ధి సామర్థ్యం గల పెట్టుబడులే అయినప్పటికీ, సరైన క్లెయిమ్‌లు లేకపోవడం, అకౌంట్లు సక్రియంగా లేకపోవడం, పెట్టుబడిదారులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఈ సొమ్ము అందుబాటులో లేకుండా పోయింది. అంతేకాదు ఇలాంటి ఖాతాల్లో ఉన్న పెట్టుబడులకు తక్కువ రాబడే వస్తుండటంతో, కాలక్రమేణా వాటి విలువ తగ్గిపోతున్న పరిస్థితి ఏర్పడింది.

వివరాలు

విభాగాల వారీగా చూస్తే

బ్యాంక్ డిపాజిట్లు - రూ.97,545 కోట్లు (44.2%) ఈక్విటీ షేర్లు - రూ.89,004 కోట్లు (40.3%) ఇన్సూరెన్స్ పాలసీలు - రూ.20,062 కోట్లు (9.1%) ఈపీఎఫ్ ఖాతాలు - రూ.10,915 కోట్లు (4.9%) మ్యూచువల్ ఫండ్లు - రూ.3,452 కోట్లు (1.6%) REITs, InvITs, NCDలు - రూ.764 కోట్లు (0.3%) ఈ డేటా ఆర్‌బీఐ నోటిఫికేషన్లు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్, ఐఈపీఎఫ్ నిబంధనలు, ఐఆర్‌డీఏఐ, ఈపీఎఫ్ఓ, సెబీ వార్షిక నివేదికల ఆధారంగా సేకరించినట్లు వెల్లడించారు. బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లో జమ చేస్తుంది.

Advertisement

వివరాలు

ఈ డబ్బుపై కేవలం 3 శాతం సాధారణ వడ్డీ మాత్రమే లభిస్తుంది

ఈ డబ్బుపై కేవలం 3 శాతం సాధారణ వడ్డీ మాత్రమే లభిస్తుంది. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఈ డబ్బు విలువ కాలక్రమేణా గణనీయంగా తగ్గిపోతుంది. గత పదేళ్లలో ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు భారీగా పెరిగాయి. 2015లో రూ.7,875 కోట్లుగా ఉన్న ఈ మొత్తం, 2025 నాటికి రూ.98,545 కోట్లకు పెరిగింది. అలాగే స్టాక్ మార్కెట్‌లో దాదాపు 1671 కంపెనీలకు చెందిన 166 కోట్ల షేర్లు క్లెయిమ్ కాకుండా ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.89,004 కోట్లు. ఈ మొత్తాన్ని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ వద్ద ఉంచుతున్నారు. పెట్టుబడిదారులు లేదా వారి కుటుంబ సభ్యులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్లలో వివరాలు పరిశీలించి, తమకు సంబంధించిన సొమ్మును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది.

Advertisement