
Post office: ఆగస్టు 1 నుంచి అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో ఆగస్టు 1, 2025 నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించే విధానం అమలులోకి రానుంది. పోస్టల్ శాఖలో ఐటీ వృద్ధికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పోస్టాఫీసులు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వ్యవస్థతో అనుసంధానమవ్వకపోవడంతో డిజిటల్ లావాదేవీలు పరిమితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లావాదేవీలను సులభతరం చేయడమే లక్ష్యంగా డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆధారంగా నూతన డిజిటల్ చెల్లింపు అప్లికేషన్ను రూపొందిస్తున్నారు.
Details
దేశవ్యాప్తంగా అమలు
ఇది దేశవ్యాప్తంగా ఆగస్టు 1 నాటికి అందుబాటులోకి రానుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఆధునికీకరణలో భాగంగా ఐటీ 2.0 ప్రాజెక్ట్ కింద డిజిటల్ చెల్లింపుల పథకాన్ని ఇప్పటికే కర్ణాటక సర్కిల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనిని విస్తరించాలని నిర్ణయించారు. తద్వారా, ఇకపై పోస్టాఫీసుల్లోనూ ఇతర యాప్ల వలె యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రణాళిక అమలవ్వటం ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఫైనాన్షియల్ సేవల విస్తరణకు ఊతమివ్వనుందని అధికారులు భావిస్తున్నారు.