Mutual funds: డైరెక్ట్ vs రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్.. అసలు తేడా ఏంటి? ఏది మీకు ఎక్కువ లాభం తెస్తుంది?
ఈ వార్తాకథనం ఏంటి
పెట్టుబడులు మొదలు పెడుతున్న చాలా మంది, మార్కెట్లో దొరికే ఎన్నో ఆప్షన్లను పోల్చుతూ ఉంటారు. కొందరికి స్టాక్స్ంటే ఇష్టం, ఇంకొందరు మాత్రం రిస్క్ తగ్గే మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లకు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేసే విధానాన్ని బట్టి ఇవి రెండు రకాలుగా ఉంటాయి: రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్.
వివరాలు
పెట్టుబడి చేసే మార్గం బట్టి వీటిలో ఉండే తేడాలు పూర్తిగా మారిపోతాయి
సాధారణంగా, రెగ్యులర్ ఫండ్స్ను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ ద్వారా కొనుగోలు చేస్తారు. కానీ డైరెక్ట్ ఫండ్స్ అంటే, గ్రో, జీరోధా కాయిన్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా మీరు నేరుగా కొనుగోలు చేసే ఫండ్స్. అయితే... రెండు ఒకే స్కీమ్ అయినా, పెట్టుబడి చేసే మార్గం బట్టి వీటిలో ఉండే తేడాలు పూర్తిగా మారిపోతాయి. డైరెక్ట్ vs రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్: ముఖ్య తేడాలు పెట్టుబడి చేసే స్కీమ్ ఒక్కటే అయినా, మీరు ఎంచుకునే ఛానల్ అది డైరెక్ట్నా లేదా రెగ్యులర్నా అని నిర్ణయిస్తుంది.
వివరాలు
ఖర్చు నిష్పత్తి (Expense Ratio)
డైరెక్ట్ ఫండ్స్: డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఖర్చు నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మధ్యవర్తులు ఉండరు. అందుకే ఇవి పెట్టుబడిదారులకు ఎక్కువ లాభదాయకం అవుతాయి. రెగ్యులర్ ఫండ్స్: రెగ్యులర్ ఫండ్స్లో మాత్రం ఖర్చు నిష్పత్తి ఎక్కువ. కారణం — డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్కి కమీషన్ చెల్లించాలి. ఈ కమీషన్ మొత్తమే చివరికి ఇన్వెస్టర్కు వచ్చే లాభాన్ని కొంచెం తగ్గిస్తుంది.
వివరాలు
ఎవరికి రెగ్యులర్ ఫండ్స్ సూట్ అవుతాయి?
మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో,పెట్టుబడులు ఎలా పనిచేస్తాయో తెలియని వారు వివిధ ఆస్తుల్లో ఇప్పటికే పెట్టుబడి పెట్టి,పరిశోధన చేసుకునే సమయం లేని ఇన్వెస్టర్లు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం కంటే,ఒక ఎక్స్పర్ట్ సూచనతో పెట్టుబడి పెట్టాలని అనుకునే వారు ఎవరికి డైరెక్ట్ ఫండ్స్ బెటర్? బ్రోకర్/డిస్ట్రిబ్యూటర్ కమీషన్ పూర్తిగా సేవ్ చేయాలనుకునేవారు మ్యూచువల్ ఫండ్స్ గురించి కనీస అవగాహన ఉన్న ఇన్వెస్టర్లు గ్రో, జీరోధా వంటి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్లో ముందే ఖాతాలు ఉన్న వారు.AMC వెబ్సైట్కి వెళ్లకుండానే ఒకే చోట అన్ని ఫండ్స్ని నేరుగా కొనుగోలు చేయాలనుకునేవారు గమనిక: ఇది కేవలం సమాచారార్ధం అందించిన వివరణ మాత్రమే.ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టేముందు,తప్పనిసరిగా SEBI రిజిస్టర్ అయిన ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.