
Muhurat Trading: ప్లాట్గా దేశీయ మార్కెట్ల సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి సందర్భంగా ప్రతేడాది స్టాక్ ఎక్స్ఛేంజీలు 'మూరత్ ట్రేడింగ్' పేరుతో ప్రత్యేక సెషన్ నిర్వహిస్తాయి. ఈసారి కూడా మంగళవారం సంవత్ 2082 కోసం గంటపాటు మూరత్ ట్రేడింగ్ జరిగింది. అయితే మార్కెట్లలో పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపించలేదు. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్62.97 పాయింట్లు పెరగగా 84,426.34 వద్ద, నిఫ్టీ 25.45 పాయింట్ల లాభంతో 25,868.60 వద్ద ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు మూరత్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆరంభంలో సూచీలు ఉత్సాహంగా కదిలాయి. సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ 25,900 మార్క్ దాటింది. అయితే ఆ జోరు చాలా కాలం నిలిచింది కాదు. చివరికి సూచీలు ఒత్తిడికి గురై, స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి.
Details
నష్టాల్లో ఏషియన్ పెయింట్స్
ఈ సెషన్లో సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ షేర్లు బలంగా ప్రదర్శించగా, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మ్యాక్స్ హెల్త్కేర్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. లోహ, మీడియా, టెలికాం సూచీలు సుమారు 0.3 శాతం పెరుగాయి. దీపావళి పండగ సందర్భంగా పెట్టుబడులు పెట్టడం మదుపర్లలో శుభప్రదంగా భావించబడుతుంది. దివ్వెల పండగ రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. స్టాక్ మార్కెట్లో ఈ పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే, వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందని చాలామంది నమ్ముతారు. ఈ నమ్మకంతోనే మూరత్ ట్రేడింగ్లో పాల్గొనేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.