20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's
బెంగళూరులోని 170కి పైగా డొమినోస్ అవుట్లెట్లు ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లోనే పిజ్జాను డెలివరీ చేస్తాయని డొమినోస్పేరెంట్ సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. పిజ్జా బ్రాండ్, డొమినోస్ సోమవారం బెంగళూరులో తమ 20 నిమిషాల పిజ్జా డెలివరీ సేవను ప్రారంభించింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ అని పేర్కొంది. అంతకుముందు 30 నిమిషాల వ్యవధిలో పిజ్జా డెలివరీతో కంపెనీ పేరు సంపాదించింది. ఇంతకుముందు, ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లు నగరాల్లో వేగవంతమైన డెలివరీ సేవలను ప్రారంభించినప్పుడు, రైడర్ల భద్రత కోసం సోషల్ మీడియాలో చర్చ జరిగినది. ఆహారం నాణ్యత, రైడర్ భద్రత విషయంలో కూడా తాము రాజీపడబోమని కంపెనీ స్పష్టం చేసింది.