NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Edible oil price hike : సామాన్యుడిపై మరింత భారం!.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
    తదుపరి వార్తా కథనం
    Edible oil price hike : సామాన్యుడిపై మరింత భారం!.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
    సామాన్యుడిపై మరింత భారం!.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు

    Edible oil price hike : సామాన్యుడిపై మరింత భారం!.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 28, 2024
    01:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పండుగ సీజన్‌లో సామాన్యులపై ధరల భారం మరింత పెరుగుతోంది. వంట నూనెల ధరలు గత నెల రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి.

    పామాయిల్ ధరలు ఏకంగా 37 శాతం పెరిగి, గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి!

    వంటింట్లో ఎక్కువగా వాడే ఆవ నూనె ధర సైతం 29 శాతం పెరిగింది. దీని ఫలితంగా రెస్టారెంట్లు, హోటల్స్, స్వీట్ షాపులు కూడా తమ మెనూ ధరలను పెంచక తప్పడం లేదు, అందువల్ల సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి.

    వివరాలు 

    ధరలు పెరగడానికి కారణాలు

    సెప్టెంబర్‌లో రీటైల్ ద్రవ్యోల్బణం 5.5 శాతానికి పెరగడం, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడం వంట నూనెల ధరలను పెంచడానికి ప్రధాన కారణం.

    పామ్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచడంతో, అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధరలు పెరగడం గమనార్హం.

    అంతర్జాతీయంగా క్రూడ్ పామ్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం పెరిగాయి. సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెపై దిగుమతి సుంకం 5.5 శాతం నుండి 27.5 శాతానికి పెంచింది.

    వివరాలు 

    భవిష్యత్తులో ధరల ప్రభావం

    భారతదేశం వంట నూనెల దిగుమతుల్లో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న కారణంగా, 58 శాతం నూనెలు దిగుమతుల ద్వారానే పొందుతుంది.

    అధికారులు ఈ ధరలు తక్కువ కాలంలో తగ్గే అవకాశాలు కనిపించడం లేదని భావిస్తున్నారు.

    వేరుశనగ, సోయాబీన్ పంటలు త్వరలో మార్కెట్లోకి రానుండటంతో దిగుమతి సుంకాలను తగ్గించే యోచన ప్రభుత్వం వద్ద లేదు.

    వివరాలు 

    ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రభావం

    కాఫీ, టీ ధరలతో పాటు వంటనూనెల తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది.

    ఈ ఏడాది కాఫీ ధరలు 60 శాతం, టీ ధరలు 25 శాతం పెరిగాయి. టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు వచ్చే త్రైమాసికంలో తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ధర

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ధర

    అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న Vivo V29 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే? స్మార్ట్ ఫోన్
    టోక్యో మోటార్ షోలో ప్రదర్శనకు సిద్ధంగా హోండా స్పోర్ట్ ఎస్‌యూవీ.. లుక్ అదిరింది! ఆటో మొబైల్
    వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు  గ్యాస్
    యెజ్డీ రోడ్‌స్టర్ వర్సెస్ హోండా హెచ్‌నెస్ CB350.. ఏ బైక్ బెస్ట్ అంటే?  ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025