NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / EPFO: ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ.. ఉత్పాదకత లింక్డ్ బోనస్‌ను ప్రకటన.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.13,816 
    తదుపరి వార్తా కథనం
    EPFO: ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ.. ఉత్పాదకత లింక్డ్ బోనస్‌ను ప్రకటన.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.13,816 
    ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ.. ఉత్పాదకత లింక్డ్ బోనస్‌ను ప్రకటన..

    EPFO: ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ.. ఉత్పాదకత లింక్డ్ బోనస్‌ను ప్రకటన.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.13,816 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 10, 2024
    04:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది.

    అర్హులైన గ్రూప్-సీ, గ్రూప్-బీ (నాన్ గెజిటెడ్) ఉద్యోగులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉత్పత్తి ఆధారిత బోనస్ (PLB) పేమెంట్‌లో కొంత అడ్వాన్స్‌గా చెల్లించడానికి నిర్ణయించారు.

    ఉద్యోగులకు పండగల సమయంలో ఆర్థిక సహాయం అందించేందుకు ఈ అడ్వాన్స్ బోనస్ చెల్లింపులు చేయడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 60 రోజుల శాలరీ బోనస్ రూపంలో ఉద్యోగులకు చెల్లించబడనుంది.

    వివరాలు 

    ఒక్కొక్కరి ఖాతాలో రూ. 13,816 

    అర్హత గల గ్రూప్ సీ, గ్రూప్ బీ ఉద్యోగులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాల్సిన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌లో ప్రస్తుతం 60 రోజుల బోనస్ అడ్వాన్స్‌గా చెల్లిస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది.

    దీనివల్ల ఒక్కొక్కరి ఖాతాలో రూ. 13,816 వరకు చెల్లించబడుతుందని సమాచారం. ఈ మేరకు సంబంధిత ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

    అయితే అర్హత కలిగిన సిబ్బంది ఈ అడ్వాన్స్‌ను వారి పీఎల్‌బీకి సర్దుబాటు చేసేందుకు, అదనంగా బోనస్ డబ్బులు ఖాతాలోకి వస్తే వెంటనే తిరిగి చెల్లించాలని సూచిస్తూ సంతకం చేసిన అండర్‌టేకింగ్‌ను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.

    ఇప్పటికే ఈపీఎఫ్ఓ నుండి పదవీ విరమణ పొందిన వారికి ఈ అడ్వాన్స్ వర్తించదని స్పష్టం చేశారు.

    వివరాలు 

    ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ బడ్జెట్ నుంచే ఈ అడ్వాన్స్ పేమెంట్లు

    అక్టోబర్ 11, 2024లోపు ఈ అడ్వాన్స్ చెల్లింపులను పూర్తి చేయాలని సంబంధిత యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

    ఎంత మంది ఉద్యోగులు, ఎంత డబ్బు పంపిణీ చేయబడిందనే పూర్తి వివరాలు అందించాల్సిందిగా స్పష్టం చేశారు.

    ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ బడ్జెట్ నుంచే ఈ అడ్వాన్స్ పేమెంట్లు ఉంటాయని తెలిపారు.

    ముందస్తు చెల్లింపు ఉత్పత్తి ఆధారిత బోనస్ మంజూరుకు వర్తించే, అనుబంధ నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు.

    ఈ నిర్ణయంతో అక్టోబర్ 11, 2024లోపు ఈపీఎఫ్ఓ గ్రేడ్ సీ, గ్రేడ్ బీ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు చొప్పించబడుతాయి.

    దసరా సందర్భంగా ఖాతాలో డబ్బులు చొప్పించబడడం వలన ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ

    తాజా

    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక  తాజా వార్తలు
    ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025