NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
    నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
    1/3
    బిజినెస్ 1 నిమి చదవండి

    నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

    వ్రాసిన వారు Naveen Stalin
    May 23, 2023
    12:45 pm
    నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
    నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని అన్ని బ్యాంకులు మంగళవారం నుంచి 2,000 రూపాయల నోట్లను మార్పిడిని స్వీకరిస్తున్నాయి. సెప్టెంబర్ 30వరకు నోట్లను బ్యాంకులు స్వీకరించనున్నాయి. అయితే బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలను తెలుసుకోండి. ఇప్పటికిప్పుడు బ్యాంకులకు వెళ్లి రూ.2వేల నోట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. కరెన్సీ మార్చుకోవడానికి ఆర్బీఐ సెప్టెంబర్ 30వరకు గుడువు విధించినా, ఆ తర్వాత కూడా నోటును వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. సెప్టెంబర్ 30వరకు ఎన్ని నోట్లు వస్తాయో చూసి, ఆ తర్వాత రూ.2000నోట్లపై తుది నిర్ణయం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.

    2/3

    డిపాజిట్లు ఎంతైనా చేసుకోవచ్చు

    ఖాతాదారులు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రూ.2000నోట్లను రోజుకు కేవలం 10 మాత్రమే మార్చుకోవచ్చు. అయితే డిపాజిట్ చేసుకోవానికి పరిమితి లేదు. భారీ మొత్తంలో డిపాజిట్ లావాదేవీల విషయంలో కచ్చితంగా KYC మార్గదర్శకాలను పాటించాలి. రూ.50,000 కంటే తక్కువ డిపాజిట్లకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. రూ. 50,000 కంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను నియమం ప్రకారం పాన్‌ను సమర్పించాలి. ఎస్బీఐ నోట్లను మార్చుకోవాలంటే రిక్వెస్ట్ ఫామ్‌ను నింపాలని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి రిక్విజిషన్ స్లిప్ లేకుండానే ఎస్‌బీఐ ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు రూ.2,000 నోట్లను మార్చుకునే సదుపాయం కల్పిస్తోంది.

    3/3

    క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే రూ.2000నోట్ల ఉపసంహరణ

    ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో నోట్లను మార్చుకునేందుకు బ్యాంక్‌లకు వచ్చే ఖాతాదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. క్యూలో ఉన్న ప్రజలకు తాగునీరు కూడా ఏర్పాటు చేయాలని, నోట్ల మార్పిడికి కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను కోరింది. చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.2వేల నోట్లు 10.8 శాతం మాత్రమే. దీంతో రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడం ఆర్థిక వ్యవస్థపై చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సెప్టెంబరు 30 నాటికి చాలా వరకు బ్యాంకులకు తిరిగి వస్తాయని భావిస్తున్నామన్నారు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్బీఐ రూ.2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంది. మెరుగైన భద్రతా కారణాలతో నాణేలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆర్ బి ఐ
    కరెన్సీ
    బ్యాంక్
    తాజా వార్తలు

    ఆర్ బి ఐ

    రూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్ కరెన్సీ
    రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే కరెన్సీ
    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన కరెన్సీ
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  చెన్నై

    కరెన్సీ

    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    ఆర్థిక వ్యవస్థపై రూ.2,000నోట్ల ఉపసంహరణ ప్రభావం ఉండదు: ఆర్‌బీఐ గవర్నర్ ఆర్ బి ఐ
    రూ.2 వేల నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి

    బ్యాంక్

    బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. వారానికి ఐదు రోజులే డ్యూటీ..? ఉద్యోగులు
    అమెరికాలో 'ఫస్ట్ రిపబ్లిక్' బ్యాంకు దివాళా; జేపీ మోర్గాన్ కంపెనీ టేకోవర్ అమెరికా
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు  షిర్డీ సాయిబాబా
    UPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు భారతదేశం

    తాజా వార్తలు

     దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి కరోనా కొత్త కేసులు
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు  ఆంధ్రప్రదేశ్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023