NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
    నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

    నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

    వ్రాసిన వారు Stalin
    May 23, 2023
    12:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో దేశంలోని అన్ని బ్యాంకులు మంగళవారం నుంచి 2,000 రూపాయల నోట్లను మార్పిడిని స్వీకరిస్తున్నాయి. సెప్టెంబర్ 30వరకు నోట్లను బ్యాంకులు స్వీకరించనున్నాయి. అయితే బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలను తెలుసుకోండి.

    ఇప్పటికిప్పుడు బ్యాంకులకు వెళ్లి రూ.2వేల నోట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు.

    కరెన్సీ మార్చుకోవడానికి ఆర్బీఐ సెప్టెంబర్ 30వరకు గుడువు విధించినా, ఆ తర్వాత కూడా నోటును వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

    సెప్టెంబర్ 30వరకు ఎన్ని నోట్లు వస్తాయో చూసి, ఆ తర్వాత రూ.2000నోట్లపై తుది నిర్ణయం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.

    ఆర్బీఐ

    డిపాజిట్లు ఎంతైనా చేసుకోవచ్చు

    ఖాతాదారులు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రూ.2000నోట్లను రోజుకు కేవలం 10 మాత్రమే మార్చుకోవచ్చు.

    అయితే డిపాజిట్ చేసుకోవానికి పరిమితి లేదు. భారీ మొత్తంలో డిపాజిట్ లావాదేవీల విషయంలో కచ్చితంగా KYC మార్గదర్శకాలను పాటించాలి.

    రూ.50,000 కంటే తక్కువ డిపాజిట్లకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. రూ. 50,000 కంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను నియమం ప్రకారం పాన్‌ను సమర్పించాలి.

    ఎస్బీఐ నోట్లను మార్చుకోవాలంటే రిక్వెస్ట్ ఫామ్‌ను నింపాలని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి రిక్విజిషన్ స్లిప్ లేకుండానే ఎస్‌బీఐ ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు రూ.2,000 నోట్లను మార్చుకునే సదుపాయం కల్పిస్తోంది.

    ఆర్బీఐ

    క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే రూ.2000నోట్ల ఉపసంహరణ

    ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో నోట్లను మార్చుకునేందుకు బ్యాంక్‌లకు వచ్చే ఖాతాదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.

    క్యూలో ఉన్న ప్రజలకు తాగునీరు కూడా ఏర్పాటు చేయాలని, నోట్ల మార్పిడికి కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను కోరింది. చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.2వేల నోట్లు 10.8 శాతం మాత్రమే.

    దీంతో రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడం ఆర్థిక వ్యవస్థపై చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సెప్టెంబరు 30 నాటికి చాలా వరకు బ్యాంకులకు తిరిగి వస్తాయని భావిస్తున్నామన్నారు.

    క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్బీఐ రూ.2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంది. మెరుగైన భద్రతా కారణాలతో నాణేలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    కరెన్సీ
    బ్యాంక్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం నరేంద్ర మోదీ
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ప్రభుత్వం
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ఫైనాన్స్
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం

    కరెన్సీ

    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ
    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన ఆర్ బి ఐ
    రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే ఆర్ బి ఐ

    బ్యాంక్

    ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు హైకోర్టు
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా
    మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse స్విట్జర్లాండ్
    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు కర్ణాటక

    తాజా వార్తలు

    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు  విశాఖపట్టణం
    దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092 కరోనా కొత్త కేసులు
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ భారతదేశం
    తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025