two wheeler subsidies: ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఇ-డ్రైవ్(PM E-DRIVE)పథకానికి సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీలను జులై 31 వరకు పొడిగించారని, అలాగే ఇ-రిక్షా, ఇ-కార్ట్ల వాహనాల సబ్సిడీలను 2028 మార్చి 31వరకు కొనసాగిస్తామని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పీఎం ఇ-డ్రైవ్ పథకం 2024 అక్టోబర్ 1న ప్రారంభించారు. కేంద్రం ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీవీలర్లు, ఇ-అంబులెన్సులు, ఇ-ట్రక్కుల కొనుగోలుకు రాయితీ అందిస్తోంది. ప్రారంభ లక్ష్యం 1.4 మిలియన్ల ఎలక్ట్రిక్ టూ వీలర్ల విక్రయంగా ఉండగా ఇప్పటివరకు 2.48 మిలియన్ల వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ సబ్సిడీ కోసం రూ.1,772 కోట్లను కేటాయించగా, ఇప్పటివరకు రూ.1,259.91 కోట్లు ఖర్చు అయ్యాయని కేంద్రం పేర్కొంది.
వివరాలు
1 మిలియన్ వాహనాలు విక్రయాలు
ఇ-రిక్షా, ఇ-కార్ట్ల విభాగంలో కేంద్రం 36,462 యూనిట్ల విక్రయ లక్ష్యం పెట్టింది. కానీ 39,034 యూనిట్లు మాత్రమే అమ్మబడ్డాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్లలో సుమారు 1 మిలియన్ వాహనాలు విక్రయమయ్యాయి. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల విభాగంలో లక్ష్యాన్ని మించి 1,62,981 యూనిట్లు అమ్మబడ్డాయి. అయితే ఇ-రిక్షా, ఇ-కార్ట్ల విభాగంలో ఆశించిన విక్రయాలు జరగని కారణంగా, ఆ విభాగాలకు కేటాయించిన నిధులను రూ.192 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గించారు. ఈ నిర్ణయంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు మళ్లీ పునరుద్ధరణ లభించడం, పర్యావరణ హితం మరియు వినియోగదారులకు ఆర్థిక సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.