FPIs rebound: భారత మార్కెట్కు ఫారిన్ ఫండ్ ఇన్ఫ్లో.. రూ.22,766 కోట్ల పెట్టుబడులు
అమెరికా ఫెడ్రల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును అంగీకరించిన నేపథ్యంలో విదేశీ పెట్టుబడుదారులు తిరిగి భారత్కు తమ పెట్టుబడులను మళ్లించారు. డిసెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీలలో రూ.22,766 కోట్లను పెట్టుబడులు చొప్పించారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. తదుపరి నవంబర్లో పెద్ద ఎత్తున విక్రయాలు చేసిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు, తాజాగా తమ కొనుగోళ్లను పెంచుకుంటున్నారు. గత సెప్టెంబర్లో రూ.57,724 కోట్ల పెట్టుబడులను మార్కెట్లోకి తరలించారు. తర్వాత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల వల్ల అక్టోబర్లో రూ.94,017 కోట్లను ఉపసంహరించుకోవడం విశేషం. నవంబర్లో నికరంగా రూ.21,612 కోట్లను మార్కెట్లో నుంచి తీసుకొచ్చారు.
విదేశీ పెట్టుబడులపై ప్రభావం
డిసెంబర్ నెలలో కేవలం రెండు వారాల్లోనే రూ.22,766 కోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ అంశాలు, ట్రంప్ ప్రభుత్వం అమలు చేసే విధానాలు, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి అంశాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు, ఆర్థిక పనితీరు పెట్టుబడిదారుల మానసికతపై కీలక ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్బీఐ క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గింపు కూడా పెట్టుబడిదారుల మానసికతను బలపరుస్తుందని తేలింది.