LOADING...
RBI Guv Sanjay Malhotra: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరల పెంపు తప్పదు: ఆర్‌బీఐ గవర్నర్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరల పెంపు తప్పదు: ఆర్‌బీఐ గవర్నర్

RBI Guv Sanjay Malhotra: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరల పెంపు తప్పదు: ఆర్‌బీఐ గవర్నర్

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. పరిస్థితులు మరింత విషమిస్తే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు తప్పకపోవచ్చని ఆయన హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లో స్విస్‌ జాతీయ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన భారం వినియోగదారులపై పడే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై విధించే పన్నులను తగ్గించిందని, చమురు సంస్థలు కూడా నష్టాలను భరిస్తూ ధరలను అదుపులో ఉంచుతున్నాయని వివరించారు.

వివరాలు 

ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం

అయితే ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ముడి చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని గవర్నర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరగడం వల్ల వస్తువుల ధరలు కూడా అధికమై ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఇటీవల ప్రజలకు సూచించారు. వీలైనంత వరకు ప్రజా రవాణా సేవలను ఉపయోగించాలని కోరారు. అలాగే బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని సూచించారు.

వివరాలు 

కస్టమ్స్‌ సుంకం 6 శాతం నుంచి 15 శాతానికి పెంపు 

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై విధించే కస్టమ్స్‌ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశముందన్న చర్చలు జరుగుతున్న వేళ ఆర్‌బీఐ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement