LOADING...
Gold Rate Today : అక్షయ తృతీయ వేళ బంగారం, వెండి ధరల్లో మార్పు..
అక్షయ తృతీయ వేళ బంగారం, వెండి ధరల్లో మార్పు..

Gold Rate Today : అక్షయ తృతీయ వేళ బంగారం, వెండి ధరల్లో మార్పు..

వ్రాసిన వారు Moogati Shabari
Apr 18, 2026
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది కీలక సమాచారం. శుక్రవారం గణనీయంగా పడిపోయిన బంగారం ధరలు, ఈరోజు తిరిగి భారీగా పెరిగాయి. అదే విధంగా వెండి ధరలు కూడా ఈరోజు బాగా పెరిగాయి. శనివారం ఉదయం లభించిన సమాచారం ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 810 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు పెరుగుదల దిశగా కదిలాయి. ఔన్స్‌కు 45 డాలర్లు పెరిగి, ప్రస్తుతం గోల్డ్ రేటు 4,833 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ. 5,000 పెరుగుదల నమోదైంది.

వివరాలు

ధరల్లో మార్పులు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,780కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,800కు చేరింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే, రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,930గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,42,950 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,42,800గా నమోదైంది.

వివరాలు

భారీగా పెరగనున్న ధరలు..

వెండి ధరల విషయానికి వస్తే, ఉదయం సమాచారం ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,80,000గా ఉంది. ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,75,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ. 2,80,000కు చేరుకుంది. అక్షయ తృతీయ సమయానికి బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపించే అవకాశం ఉంది.

Advertisement