NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / బంగారంపై ఇజ్రాయెల్‌-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    బంగారంపై ఇజ్రాయెల్‌-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా
    పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా

    బంగారంపై ఇజ్రాయెల్‌-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 12, 2023
    03:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్‌ - హమాస్ అనూహ్య యుద్ధ పరిస్థితుల కారణంగా బులియన్‌ మార్కెట్‌లోనూ ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి.

    ఓవైపు యుద్ధంతో ఇజ్రాయెల్‌ ప్రజలు భీతిలిపోతున్నారు. మరోవైపు పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.

    మరోవైపు భారత్ ఎక్కువగా బంగారం దిగుమతులపైనే ఆధారపడుతోంది. వార్ కారణంగా గోల్డ్ రవాణాలో ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో బంగారం సమయానికి అందుబాటులోకి రాక ధరలు పెరుగుతున్నాయని బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ప్రస్తుతం శుభ కార్యక్రమాలు జేరుగుతుండటం, దేవిశరన్నవరాత్రులు, దసరా, లక్ష్మిపూజ, దీపావళి లాంటి పెద్ద పండగల సీజన్‌ ఆరంభమవుతోంది.

    ప్రస్తుతం శుభ కార్యక్రమాలు జరుగుతుండటం, దేవిశరన్నవరాత్రులు, దసరా, దీపావళి, లక్ష్మీపూజ లాంటి పెద్ద పండగల సీజన్‌ ఆరంభమవుతోంది.

    ఈ సందర్బంగా బంగారం కొనుగోళ్లు ఊపందుకుని ధరలు భారీగా పెరగాల్సి ఉంది.

    detaisl

    యుద్ధం తీవ్రమైతే మరింత పెరగనున్న బంగారం ధరలు

    కానీ గత నెల నుంచి పసిడి ధర తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థితిగతులు, స్థానికంగా కొనుగోళ్ల తగ్గుదల తదితర కారణాలతో నెల రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. దీంతో కొనుగోలుదార్లలో ఆశలు నిలిచాయి.

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యాక ఏపీలోని ఉమ్మడి తూగో జిల్లాలో బంగారం,వెండి ధరలకు రెక్కలొచ్చాయి.

    గత శనివారం మధ్యాహ్నం వరకు గ్రాము ధర పన్నులతో కలిపి రూ.5,770 వరకు ఉండగా, యుద్ధంతో సోమవారం మధ్యాహ్నం రూ.5,914కు చేరుకుంది.

    మంగళవారం గ్రాముపై మరో రూ.14 పెరగడంతో రూ.5,928కి ఎగబాకింది.4 రోజుల్లో గ్రాముకు రూ.158 పెరగడం గమనార్హం.

    కేజీ వెండి ధర శనివారం రూ.68,300 ఉండగా, మంగళవారం రూ.71,660కు దూసుకెళ్లింది.యుద్ధం తీవ్రమైతే ధరలు పెరిగే అవకాశముందని అంచనా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    తాజా

    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్
    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel-Hamas conflict: నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది మృతి  అంతర్జాతీయం
    ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు  చమురు
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు    భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025