Gold and Silver మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. మూడు లక్షల దిశగా వెండి
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో దేశంలో బంగారం,వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజుల వ్యవధిలోనే 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1,550 వరకు పెరగడం గమనార్హం. అయితే,ఈ వారం మొత్తం పెరుగుదల మాత్రం మోస్తరు స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం,బుధవారం ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,999గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,160 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.3,00,100గా ఉంది.
వివరాలు
వెండి ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నైలో బంగారం ధరలు అత్యధికంగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,340కు చేరింది. ముంబైలో ఈ ధర రూ.1,53,990గా ఉండగా,ఢిల్లీలో రూ.1,54,140గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,43,310గా ఉంది.ఢిల్లీలో రూ.1,41,310గా, ముంబైలో రూ.1,41,160గా నమోదైంది. వెండి ధరల విషయానికి వస్తే చెన్నైలో కిలో వెండి ధర ఇప్పటికే రూ.3 లక్షల మార్కును తాకింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలు అదే స్థాయికి చేరువలో కొనసాగుతున్నాయి. గమనిక: బంగారం,వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిదని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.