NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Vivad Se Vishwas 2.0: అక్టోబర్‌ 1 నుంచి వివాద్‌ సే విశ్వాస్‌ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    Vivad Se Vishwas 2.0: అక్టోబర్‌ 1 నుంచి వివాద్‌ సే విశ్వాస్‌ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం
    అక్టోబర్‌ 1 నుంచి వివాద్‌ సే విశ్వాస్‌ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం

    Vivad Se Vishwas 2.0: అక్టోబర్‌ 1 నుంచి వివాద్‌ సే విశ్వాస్‌ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 20, 2024
    01:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించేందుకు తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం (Vivad Se Vishwas 2.0) అమలుకు సంబంధించిన తేదీని ప్రకటించింది.

    ఈ పథకం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుందని శుక్రవారం వెల్లడించింది.

    2024-25 బడ్జెట్‌లో జులైలో ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

    ప్రస్తుతం వివిధ న్యాయ వేదికల్లో రూ.35 లక్షల కోట్ల విలువైన 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొనబడింది.

    ఈ సమస్యను పరిష్కరించేందుకు, పన్ను విధానాలను సులభతరం చేసి, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు.

    వివరాలు 

    ప్రభుత్వ ఖజానాకు రూ.75 వేల కోట్ల ఆదాయం

    ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, ఫారాలు వచ్చే వారం అందుబాటులోకి వస్తాయని డెలాయిట్ ఇండియా భాగస్వామి కరిష్మా ఆర్ ఫాటర్మేకర్ తెలిపారు.

    2020లో కూడా ఈ పథకం ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారం కోసం కేంద్రం తీసుకొచ్చింది.

    వివాద్ సే విశ్వాస్ పేరిట ప్రారంభమైన ఆ పథకాన్ని లక్ష మందికి పైగా పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకున్నారు.

    దాంతో ప్రభుత్వ ఖజానాకు రూ.75 వేల కోట్ల ఆదాయం లభించింది. ఈ విజయంతో, కేంద్రం 2.0 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.

    2024 జులై 22 నాటికి సుప్రీం కోర్టు, హైకోర్టు, ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్స్, కమిషనర్లు/జాయింట్ కమిషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాలను ఈ పథకం కింద పరిష్కరించుకోవచ్చని పేర్కొనబడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    నిర్మలా సీతారామన్

    తాజా

    Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్ కన్నప్ప
    Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు! అమెరికా
    Airtel Fraud Detection: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా 'ఫ్రాడ్‌ డిటెక్షన్‌' ఫీచర్‌ అందుబాటులోకి! ఎయిర్ టెల్
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    కేంద్ర ప్రభుత్వం

    Road accident: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం.. పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఆటోమొబైల్స్
    ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన  దిల్లీ
    IVF Case: మూసేవాలా తల్లికి IVF చికిత్స.. చట్టబద్ధతను ప్రశ్నించిన కేంద్రం  పంజాబ్
    Supreme Court : యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో సీబీఐ లేదు: సుప్రీంకోర్టులో కేంద్రం సుప్రీంకోర్టు

    నిర్మలా సీతారామన్

    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం బడ్జెట్ 2023
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ ఆర్థిక శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025