HDFC Bank: క్రెడిట్ స్విస్ బాండ్ వివాదం: 12 మంది అధికారులపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ స్విస్ AT1 బాండ్ల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 12 మంది సీనియర్,మిడ్ లెవల్ అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో బ్యాంక్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వీరిలో అశిష్ పార్థసారథి కూడా ఉన్నారు. సంబంధిత అధికారుల ఇన్క్రిమెంట్లు,ఈఎస్ఓపీలను బ్యాంక్ రద్దు చేసింది. ఈ చర్యలు AT1 బాండ్ వివాదానికి సంబంధించిన బాధ్యతా చర్యలలో భాగంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక గత ఏడాదిలోనే బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ సంపత్ కుమార్ సహా ముగ్గురు సీనియర్ అధికారులను బ్యాంక్ తొలగించింది. అంతేకాక హర్ష్ గుప్తా, పాయల్ మంద్యాన్ అనే ఇద్దరినీ అంతర్గత విచారణ అనంతరం డిస్మిస్ చేసింది.
వివరాలు
Credit Suisse కు చెందిన AT1 బాండ్లను పూర్తిగా రద్దు చేయడంతో పెట్టుబడిదారులకు భారీ నష్టం
2025 జనవరిలో దుబాయ్ శాఖలో డెట్ ఉత్పత్తుల మిస్-సెల్లింగ్పై విచారణ ప్రారంభించిన తర్వాత వీరిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం 2023 మార్చి నుంచే ప్రారంభమైంది. కొంతమంది AT1 బాండ్ ఇన్వెస్టర్లు తమ FCNR డిపాజిట్లను భారత్ నుంచి బహ్రెయిన్కు మార్చాలని ప్రోత్సహించారని ఆరోపించారు. అదే సమయంలో స్విస్ రెగ్యులేటర్లు Credit Suisse కు చెందిన AT1 బాండ్లను పూర్తిగా రద్దు చేయడంతో పెట్టుబడిదారులకు భారీ నష్టం జరిగింది. UBS అత్యవసరంగా టేకోవర్ చేసిన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ ఘటనలో ఎలాంటి మోసం జరగలేదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ,సీఈఓ Sashidhar Jagdishan స్పష్టం చేశారు.
వివరాలు
కొత్త కస్టమర్లను ఆన్బోర్డ్ చేయడంపై నిషేధం
ఇది మోసం కాదు... కేవలం పేపర్వర్క్ లేదా నిబంధనలను అర్థం చేసుకునే విధానంలో జరిగిన చిన్న తప్పు మాత్రమే. ఇక 2025 సెప్టెంబర్లో ఈ వ్యవహారం మరింత బహిరంగమైంది. దుబాయ్ ఆర్థిక సేవల ప్రాధికార సంస్థ నిబంధనల ఉల్లంఘనల కారణంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) శాఖకు కొత్త కస్టమర్లను ఆన్బోర్డ్ చేయడాన్ని నిషేధించింది. సరైన విధానాలు పాటించకపోవడం, సలహా సేవల్లో లోపాలు ఉండటం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడైంది.