NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / WEF: ఎర్ర సముద్రంలో సంక్షోభం.. భారత్‌లో చమురు ధరల్లో పెరుగుదల: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 
    తదుపరి వార్తా కథనం
    WEF: ఎర్ర సముద్రంలో సంక్షోభం.. భారత్‌లో చమురు ధరల్లో పెరుగుదల: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 
    WEF: ఎర్ర సముద్రంలో సంక్షోభం.. భారత్‌లో చమురు ధరల్లో పెరుగుదల: వరల్డ్ ఎకనామిక్ ఫోరం

    WEF: ఎర్ర సముద్రంలో సంక్షోభం.. భారత్‌లో చమురు ధరల్లో పెరుగుదల: వరల్డ్ ఎకనామిక్ ఫోరం 

    వ్రాసిన వారు Stalin
    Jan 15, 2024
    12:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై పదేపదే దాడులు చేయడంతో ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

    ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బోర్గే బ్రెండే పేర్కొన్నారు.

    ఫలితంగా భారతదేశం వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై తీవ్రమైన ప్రభావం ఉటుందని వెల్లడించారు.

    ఉద్రిక్తతల వల్ల ఎర్ర సముద్రాన్ని మూసివేస్తే ప్రతికూల ప్రభావం చూపడానికి ఎక్కువ సమయం పట్టదన్నారు.

    సూయజ్ కెనాల్‌ను వారాలపాటు మూసివేయడం కూడా ప్రపంచ సరఫరాపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నారు.

    దీని వల్ల చమురు ధరలు పెరుగుతాయని, ఫలితంగా భారతదేశం వంటి పెద్ద చమురు దిగుమతి దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    చమురు

    ఈ ఏడాది 8శాతం భారత ఆర్థిక వృద్ధి

    ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు అతి త్వరలో ఆగిపోతాయని బోర్గే బ్రెండే ఆశాభావం వ్యక్తం చేశారు.

    ప్రపంచ వాణిజ్యం ఈ సంవత్సరం పుంజుకునే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

    భారత ఆర్థిక వ్యవస్థపై బోర్డే ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ ఏడాది 8 శాతం వృద్ధిని సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

    రాబోయే రెండు దశాబ్దాల్లో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ పయనిస్తుందన్నారు.

    డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ రెండింతలు వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

    డిజిటల్ ఎకానమీ, సేవల ఎగుమతుల కారణంగా భారత్ ముందంజలో ఉందని బ్రెండే చెప్పారు. ఇది భారతదేశానికి చాలా మంచి అవకాశం అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చమురు
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    చమురు

    వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్ వాణిజ్య సిలిండర్
    గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర వాణిజ్య సిలిండర్
    నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు విమానం
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ  పెట్రోల్

    భారతదేశం

    India aid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాకు రెండో విడత సాయాన్ని పంపిన భారత్  పాలస్తీనా
    E-visa services for Canada : రెండు నెలల తరువాత  కెనడియన్లకు ఈ-వీసా సేవలను పునఃప్రారంభించిన భారత్  భారతదేశం
    qatar: భారత నేవీ అధికారులకు మరణశిక్ష రద్దుపై భారత్ విజ్ఞప్తి.. ఆమోదించిన ఖతర్ ఖతార్
    China Pneumonia: భయపెడుతున్న చైనా న్యుమోనియా.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? భారత్ తీసుకుంటున్న చర్యలేంటి? చైనా

    తాజా వార్తలు

    Sena vs Sena: షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ: మహారాష్ట్ర స్పీకర్  మహారాష్ట్ర
    Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు  గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    Elon Musk: ట్విట్టర్(ఎక్స్‌)లో హానికర కంటెంట్‌ అందుకే పెరిగిందట  ఎక్స్
    India vs Afghanistan T20: చివరి సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని ఇస్తుందా?  టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025