English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Meesho: సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా ఆన్‌లైన్ ఉత్పత్తుల సంస్థ మీషో.. రూ.5 కోట్లకు పైగా నష్టం
    తదుపరి వార్తా కథనం
    Meesho: సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా ఆన్‌లైన్ ఉత్పత్తుల సంస్థ మీషో.. రూ.5 కోట్లకు పైగా నష్టం
    సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా ఆన్‌లైన్ ఉత్పత్తుల సంస్థ మీషో.. రూ.5 కోట్లకు పైగా నష్టం

    Meesho: సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా ఆన్‌లైన్ ఉత్పత్తుల సంస్థ మీషో.. రూ.5 కోట్లకు పైగా నష్టం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 03, 2024
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆన్‌లైన్‌ షాపింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉండడంతో, ఇప్పుడు ఎలాంటి వస్తువునైనా సులభంగా ఆర్డర్‌ చేయగలుగుతున్నాము.

    కొన్ని ఈ కామర్స్‌ సంస్థలు, వస్తువు నచ్చకపోయినా లేదా నాణ్యత లోపం ఉన్నా, రిటర్న్‌ ఆప్షన్‌ను అందిస్తున్నాయి.

    ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడ్డారు.

    ఈసారి వారు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ "మీషో" (Meesho)ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మోసంతో కంపెనీకి రూ. 5 కోట్లకుపైగా నష్టం జరిగింది.

    కొంతమంది సైబర్‌ నేరగాళ్లు మీషోలో విక్రేతలుగా ఉన్నారు. వారే కొనుగోలుదారులుగా ఫేక్‌ అకౌంట్ల నుంచి వస్తువులను ఆర్డర్‌ చేసేవారు.

    వివరాలు 

    జనవరి నుంచి జులై వరకు రూ. 5.5 కోట్ల వరకు దోచుకున్నారు

    వారు మంచి వస్తువులను స్వీకరించి, పాత, నష్టమైన వస్తువులతో వాటిని భర్తీ చేసి, రిటర్న్‌ పెట్టేవారు.

    వారు దీనికి సంబంధించి వీడియోలను కూడా సాక్ష్యంగా అందించేవారు. ఇలా నాణ్యత లేని వస్తువులను కంపెనీకి ఇచ్చి, డబ్బును తిరిగి పొందేవారు.

    ఈ రకమైన మోసంతో ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు రూ. 5.5 కోట్ల వరకు దోచుకున్నారు.

    ఈ విషయంలో ఆందోళన చెందిన సంస్థ ఒక అధికారి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా,ఈ మోసం వెలుగు చూడటానికి కారణమైంది.

    పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మీషో
    సైబర్ నేరం

    తాజా

    Andrapradesh: ఏపీలో వచ్చే మూడ్రోజులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. ముఖ్యంగా ఆ జిల్లాలో!  బంగాళాఖాతం
    Stock Market : వరుస లాభాలకు బ్రేక్‌.. ప్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు  స్టాక్ మార్కెట్
    Austria: ఆస్ట్రియాలోని పాఠశాలలో కాల్పులు కలకలం.. 11మంది మృతి! ఆస్ట్రియా
    WTC final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ వరకు ఆసీస్‌ సాగించిన ప్రయాణిమిదే! ఆస్ట్రేలియా

    మీషో

    Meesho: 'మీషో' ఉద్యోగులకు 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు..' ల్యాప్‌టాప్‌లు,ఇమెయిల్‌లు,సమావేశాలు లేవు'  బిజినెస్

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025