LOADING...
Coal gasification: బొగ్గు గ్యాసిఫికేషన్‌కు భారీ బూస్ట్‌.. రూ. 37,500 కోట్ల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బొగ్గు గ్యాసిఫికేషన్‌కు భారీ బూస్ట్‌.. రూ. 37,500 కోట్ల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Coal gasification: బొగ్గు గ్యాసిఫికేషన్‌కు భారీ బూస్ట్‌.. రూ. 37,500 కోట్ల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 04, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయి పథకాన్ని తీసుకురానుంది. రూ.37,500 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం త్వరలో ఆమోదం తెలిపే అవకాశముందని సమాచారం. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇందుకోసం బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే రూ.37,500 కోట్ల ఆర్థిక వ్యయంతో కేబినెట్‌ నోట్‌ను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఉపరితల బొగ్గు, లిగ్నైట్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా ఎల్‌ఎన్‌జీ, యూరియా, అమ్మోనియం నైట్రేట్‌, మిథనాల్‌ వంటి కీలక ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడం, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

వివరాలు

గత పథకంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల

2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్‌ సామర్థ్యాన్ని సాధించాలనే జాతీయ లక్ష్యానికి ఇది బలాన్నిస్తుంది. ఈ పథకం కింద ఒక్కో ప్రాజెక్టుకు గరిష్ఠంగా రూ.3,000 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. గత పథకంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ముందుగా ప్రైవేట్‌ రంగ ప్రాజెక్టులకు గరిష్ఠంగా రూ.1,000 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1,350 కోట్ల వరకు మాత్రమే ప్రోత్సాహకం లభించేది. ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలో అంతరాయాలకు దారితీస్తున్న నేపథ్యంలో ఈ పథకానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

Advertisement