NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
    తదుపరి వార్తా కథనం
    Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
    స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

    Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ నష్టం.. 800 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 13, 2025
    01:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.

    ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.

    ఈ వారంలో ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

    ఈ కారణంగా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800 పాయింట్లు కోల్పోవడం విశేషం. ఇక నిఫ్టీ 23,200 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.

    Details

    లాభాల్లో యాక్సిస్ బ్యాంక్

    ప్రారంభ నష్టాల తరువాత, ప్రధాన షేర్లలో కొనుగోలుల మద్దతుతో మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 564 పాయింట్లు తగ్గి 76,841 వద్ద ట్రేడవుతోంది.

    నిఫ్టీ 180 పాయింట్లు తగ్గి 23,250 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఎంఅండ్ ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టైటాన్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.93 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు 2,714 వద్ద ట్రేడ్ కావడం గమనార్హం.

    Details

     నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.27 వద్ద ఉంది. గత ట్రేడింగ్ సెషన్‌లో, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు కూడా అదే దిశలో పయనిస్తున్నాయి.

    జపాన్ నిక్కీ, ఏఎస్‌ఎక్స్, హాంగ్‌సెంగ్ సూచీలు 1 శాతం మేర నష్టాలను చవిచూశారు.

    శుక్రవారం విదేశీ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.2,255 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.3,962 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    వ్యాపారం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    స్టాక్ మార్కెట్

    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 24,300 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ  బిజినెస్
    Vishal Mega Mart: విశాల్‌ మెగామార్ట్‌ 33.33% ప్రీమియంతో మార్కెట్లో ఎంట్రీ!  ఐపీఓ
    Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మార్కెట్లపై 'ఫెడ్‌' దెబ్బ..  బిజినెస్

    వ్యాపారం

    Domino's: కేవలం 20 నిమిషాల్లోనే డెలవరీ.. ధ్రువీకరించిన డొమినోస్  ప్రపంచం
    Apple music : ఆపిల్ మ్యూజిక్ బుక్.. 100 బెస్ట్ ఆల్బమ్స్‌తో లాంచ్ ఆపిల్
    Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ 8% ప్రీమియంతో ఇవాళ లిస్టింగ్ స్విగ్గీ
    Retirement planning: రిటైర్‌మెంట్ ప్లానింగ్.. EPF, PPF, SIPలో ఏది బెస్ట్?  పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025