NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / FPIs withdraw: దేశీయ ఈక్విటీల్లో భారీ నష్టాలు.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల భారీ ఉపసంహరణ
    తదుపరి వార్తా కథనం
    FPIs withdraw: దేశీయ ఈక్విటీల్లో భారీ నష్టాలు.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల భారీ ఉపసంహరణ
    దేశీయ ఈక్విటీల్లో భారీ నష్టాలు.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల భారీ ఉపసంహరణ

    FPIs withdraw: దేశీయ ఈక్విటీల్లో భారీ నష్టాలు.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల భారీ ఉపసంహరణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 27, 2024
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులను తగ్గిస్తూ భారీగా విక్రయాలు కొనసాగిస్తున్నారు.

    అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్‌ మొదటి నుంచి ఇప్పటి వరకు విదేశీ మదుపర్లు నిశ్చితంగా నిధులను ఉపసంహరించుకున్నారు.

    అక్టోబర్‌ 1 నుండి 25 వరకూ, విదేశీ మదుపర్లు దేశీయ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.85,790 కోట్లను వెనక్కి తీసుకున్నారని నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ డేటా స్పష్టం చేసింది.

    ఇది ఈ ఏడాది గరిష్ఠ ఔట్‌ఫ్లోగా నిలిచింది. ఈ కాలంలో విదేశీ సంస్థలు రుణ మార్కెట్లో మాత్రం రూ.410 కోట్ల పెట్టుబడులను చేర్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

    Details

    వడ్డీ రేట్ల పెట్టుబడులు కారణంగా పెట్టుబడుల ఉపసంహరణ

    యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు కూడా పెట్టుబడుల ఉపసంహరణకు కారణంగా మారింది.

    చైనా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ, ప్రపంచ రాజకీయ సంక్షోభం వంటి అంశాలు కూడా పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం చూపిస్తున్నాయి.

    భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 76 డాలర్లకు చేరుకుంది.

    ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌పీఐలు రూ.25,744 కోట్ల విలువైన పొజిషన్లను విక్రయించగా, ఫిబ్రవరిలో మాత్రం రూ.1539 కోట్లు, మార్చిలో రూ.35,098 కోట్లను నికర పెట్టుబడులుగా చేర్చారు.

    ఏప్రిల్‌ నుంచి మళ్లీ పెట్టుబడులను తగ్గిస్తూ, మే నెలలో రూ.25,586 కోట్లు ఉపసంహరించుకున్నారు.

    జూన్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం విదేశీ పెట్టుబడులు మళ్లీ పెరిగి, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విదేశీ మదుపర్లు షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    వ్యాపారం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    చైనా

    China: చైనా 300 ఎక్సాఫ్లాప్ కల: వారు 2025 నాటికి దానిని సాధించగలరా? టెక్నాలజీ
    China's 'artificial sun': అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తున్న చైనా 'కృత్రిమ సూర్యుడు'  టెక్నాలజీ
    china: ప్రపంచంలోని ఇతర దేశాల కంటే రెండింతలు పవన, సౌర విద్యుత్‌ను నిర్మిస్తున్న చైనా  అంతర్జాతీయం
    Xiaomi: కొత్త అటానమస్ స్మార్ట్ ఫ్యాక్టరీ ఆవిష్కరణ..సంవత్సరానికి 1 మిలియన్ ఫోన్ల ఉత్పత్తి ఫోన్

    వ్యాపారం

    Zomoto: జొమాటోలో న్యూ ఫీచర్.. ఇక ఆర్డర్‌ని 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం జొమాటో
    Nifty Microcap 250 index:అధిక రాబడులు పొందాలనుకుంటున్నారా? నిఫ్టీ మైక్రోక్యాప్ 250లో లాభాలు, నష్టాలు గురించి తెలుసుకోండి బిజినెస్
    Goldman Sachs : 1,800 మంది ఉద్యోగులను తొలగించిన గోల్డ్‌మన్ సాక్స్ ఉద్యోగుల తొలగింపు
    Vistara : మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు విస్తారా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025