NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Income Tax dept: 7 ఐటీఆర్‌ పత్రాలు అందుబాటులోకి.. నోటిఫై చేసిన ఆదాయపు పన్ను విభాగం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Income Tax dept: 7 ఐటీఆర్‌ పత్రాలు అందుబాటులోకి.. నోటిఫై చేసిన ఆదాయపు పన్ను విభాగం
    7 ఐటీఆర్‌ పత్రాలు అందుబాటులోకి.. నోటిఫై చేసిన ఆదాయపు పన్ను విభాగం

    Income Tax dept: 7 ఐటీఆర్‌ పత్రాలు అందుబాటులోకి.. నోటిఫై చేసిన ఆదాయపు పన్ను విభాగం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 13, 2025
    08:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2025-26మదింపు సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫారాల్ని ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ప్రకటించింది.

    ఇందులో మొత్తం ఏడు రకాల ఫారాలను నోటిఫై చేశారు. చిన్న,మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులచే ఎక్కువగా ఉపయోగించే ఐటీఆర్-1,ఐటీఆర్-4 ఫారాలను ఏప్రిల్ 29న నోటిఫై చేయగా, ట్రస్టులు,చారిటబుల్ సంస్థలు ఉపయోగించే ఐటీఆర్-7 ఫారాన్ని మే 11న విడుదల చేశారు.

    ఈఏడాది ఫారాల్లో ముఖ్యమైన మార్పు,ఈక్విటీలపై లభించే దీర్ఘకాలిక మూలధన లాభాలకు(లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్-LTGC) సంబంధించింది.

    ఒకఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల లోపు ఎల్‌టీసీజీ పొందే వ్యక్తులు ఇప్పుడు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ద్వారా రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.

    గతంలో ఇలాంటి ఆదాయాన్ని పొందే వారు తప్పనిసరిగా ఐటీఆర్-2 ద్వారా రిటర్న్ ఫైల్ చేయాల్సి వచ్చేది.

    వివరాలు 

    అదనంగా 12.5 శాతం పన్ను

    ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్‌ల వంటి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్‌లపై సంవత్సరానికి రూ.1.25 లక్షల వరకు లభించే ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపుకు అర్హత కలదు.

    అయితే ఆ లాభం ఈ మొత్తాన్ని మించితే, అదనంగా 12.5 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది.

    పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను 2025 జులై 31వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు.

    ఇక మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఐటీఆర్-2,ఐటీఆర్-3, ఐటీఆర్-5, ఐటీఆర్-6, ఐటీఆర్-7లలోనూ కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు.

    ముఖ్యంగా 2024 జులై 23 ముందు వచ్చిన లాభాలు, తరువాత వచ్చిన లాభాలను వేర్వేరు విభాగాల్లో చూపించాల్సి ఉంటుంది.

    ఇది మూలధన లాభాలను స్పష్టంగా వర్గీకరించేందుకు తీసుకొచ్చిన మార్పు.

    వివరాలు 

    పాత విధానంలో 20 శాతం పన్ను

    2024 జులై 24న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఓ కీలకమైన ప్రతిపాదనను తీసుకొచ్చారు.

    దీని ప్రకారం, స్థిరాస్తులపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలను గణించే సమయంలో ఇకపై ద్రవ్యోల్బణ సూచీ సర్దుబాటు అవసరం లేకుండా నేరుగా 12.5 శాతం పన్నును చెల్లించవచ్చు.

    అయితే, ఎవరి వద్ద ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా లెక్కించాలన్న ఎంపిక ఉంటే, అలాంటి సందర్భాల్లో పాత విధానంలో 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    తాజా

    Income Tax dept: 7 ఐటీఆర్‌ పత్రాలు అందుబాటులోకి.. నోటిఫై చేసిన ఆదాయపు పన్ను విభాగం ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    Flights: ఇండిగో,ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. జమ్మూ, శ్రీనగర్‌ సహా పలు సరిహద్దు నగరాలకు విమాన సర్వీసులను రద్దు ఎయిర్ ఇండియా
    IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆరు వేదికల్లో 17 నుంచి ఐపీఎల్‌ బీసీసీఐ
    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ

    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    ట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ హైదరాబాద్
    నేటితో ముగియనున్న ఆధార్‌ పాన్‌ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ ఆధార్ కార్డ్
    పన్నుల ఎగవేత విషయంలో.. హయర్ కార్యాలయాలపై ఐటీ దాడులు భారతదేశం
    2047 నాటికి ఇండియాలో తలసరి ఆదాయం రూ.14.9 లక్షలు.. ఏడున్నర రెట్ల పెరుగుదల ఆర్థిక సంవత్సరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025