NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Smart City Mission: పదేళ్లలో స్మార్ట్‌ సిటీలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన భారత్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Smart City Mission: పదేళ్లలో స్మార్ట్‌ సిటీలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన భారత్‌
    పదేళ్లలో స్మార్ట్‌ సిటీలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన భారత్‌

    Smart City Mission: పదేళ్లలో స్మార్ట్‌ సిటీలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన భారత్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2025
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్మార్ట్‌ సిటీ మిషన్‌కు ఈ నెలతో 10 ఏళ్లు పూర్తయ్యాయి.

    2015 జూన్‌లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక పథకంలో ఇప్పటివరకు రూ.1.5 లక్షల కోట్లకుపైగా వ్యయం చేసి 7,504 ప్రాజెక్టులు పూర్తి చేసినట్టు ఏప్రిల్ 11, 2025 నాటికి గణాంకాలు తెలిపాయి.

    ఇది మొత్తం ప్రణాళికలో ఉన్న ప్రాజెక్టుల 94 శాతం. మరోవైపు, రూ. 13,142 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం ప్రగతిలో ఉన్నాయి.

    ఈ పథకానికి కేంద్రమంత్రి స్థాయిలో ఆర్థిక సహాయంగా ఐదు సంవత్సరాల కాలానికి రూ.48,000 కోట్లు కేటాయించారు.

    ప్రతి నగరానికి సంవత్సరానికి సగటున రూ.100 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. అదే విధంగా రాష్ట్రాలు కూడా అంతే మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంది.

    Details

    మూడు రాష్ట్రాల ఖాతాలో మూడింటొకటి వ్యయం

    ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు 92 శాతం ఖర్చు 21 ప్రధాన రాష్ట్రాల్లోనే జరిగడం విశేషం.

    వీటిలో ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలు అత్యధికంగా ఖర్చు చేసిన రాష్ట్రాలుగా నిలిచాయి.

    ఈ మూడు రాష్ట్రాల ఖాతాలో మొత్తం వ్యయంతో పోల్చితే దాదాపు మూడింటొకటి ఉంది. ఈ గణాంకాలను SBI రీసెర్చ్ వెల్లడించింది.

    Details

    టాప్‌ 25 నగరాల్లో 31 శాతం ఖర్చు

    ఇప్పటివరకు ఖర్చైన మొత్తంలో రూ.51,725 కోట్లు (31 శాతం) మొత్తం టాప్‌ 25 నగరాల్లో మాత్రమే ఖర్చైంది.

    వాటిలో వారణాసి (ఉత్తరప్రదేశ్), న్యూటౌన్‌ (పశ్చిమ బెంగాల్), శ్రీనగర్‌ (జమ్మూ కాశ్మీర్), రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్), ఇన్దోర్‌ (మధ్యప్రదేశ్‌) వంటి నగరాలు ఉన్నాయి.

    మౌలిక వసతులపైనే అధిక దృష్టి

    మొత్తం ఖర్చులో సగానికి పైగా మొబిలిటీ (రవాణా), వాటర్ అండ్ సానిటేషన్ (నీటి సరఫరా, పారిశుధ్యం) వంటి మౌలిక వసతుల అభివృద్ధిపైనే వెచ్చించారు.

    ఈ రంగాల్లో 3,000 కంటే ఎక్కువ ప్రాజెక్టులు అమలయ్యాయి.

    స్మార్ట్‌ సిటీ మిషన్ ద్వారా నగరాలను స్మార్ట్‌గా మార్చేందుకు కేంద్రం రాష్ట్రాలకు సరిపడా నిధులతో మద్దతు ఇస్తూ, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    Cop Slaps Boy: సూరత్‌లో మోడీ కాన్వాయ్ రిహార్సల్‌.. సైకిల్ తొక్కిన బాలుడిని చితకబాదిన పోలీసులు! గుజరాత్
    PM Modi: మహిళా సాధికారతే నా అసలైన సంపద: ప్రధాని మోదీ ఇండియా
    PM Modi: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ ఉప రాష్ట్రపతి
    PM Modi: నేటి నుంచి రెండ్రోజులు మారిషస్‌‌లో మోదీ..  భారతదేశం

    ప్రధాన మంత్రి

    తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు  రాజస్థాన్
    నేడు నిజామాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన  నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం  నరేంద్ర మోదీ
    మణిపూర్‌లో కుకి యువకుడిని సజీవ దహనం.. ప్రధాని మోదీపై 'ఇండియా' కూటమి విమర్శలు  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025