NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / US Trade deal: ఇండియా మార్కెట్‌పై అమెరికా కన్ను.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కి మద్దతుగా ఒత్తిడి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    US Trade deal: ఇండియా మార్కెట్‌పై అమెరికా కన్ను.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కి మద్దతుగా ఒత్తిడి 
    ఇండియా మార్కెట్‌పై అమెరికా కన్ను.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కి మద్దతుగా ఒత్తిడి

    US Trade deal: ఇండియా మార్కెట్‌పై అమెరికా కన్ను.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కి మద్దతుగా ఒత్తిడి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2025
    02:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఈ కామర్స్‌ మార్కెట్‌ (దాదాపు 125 బిలియన్ డాలర్ల) పట్ల అమెరికా గట్టిగా దృష్టిసారించింది.

    తమ కంపెనీల పట్టు బలోపేతం చేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది.

    ప్రస్తుతం న్యూఢిల్లీకి విధించిన 26 శాతం సుంకాలకు సంబంధించి చర్చలు సాగుతుండగా, ఈ సందర్భంలో ఈకామర్స్ రంగం కూడా చర్చకు వచ్చింది.

    భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న వివిధ స్థాయి సదస్సుల్లో ఈకామర్స్‌ రంగంలోని అన్ని సంస్థలకు సమాన అవకాశాలు, సమర్థవంతమైన వాణిజ్య పరిసరాల కల్పనపై చర్చలు జరిగాయి.

    తాజాగా భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరుదేశాల ప్రయోజనాలను సమపాళ్లలో రక్షించే దిశగా చర్చలు సాగుతున్నాయి.

    Details

    ఈ కామర్స్ సంస్థలపై విధిస్తున్న నిబంధనలపై స్పందన

    ఇంధన, రక్షణ, వ్యూహాత్మక టెక్నాలజీల పరంగా సహకారం మరింత బలపడుతుందన్నారు.

    ఈ నేపథ్యంలో వాల్‌మార్ట్‌ సీఈఓ మెక్‌మిలన్ గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసి, భారత్‌లోని ఈకామర్స్‌ సంస్థలపై విధిస్తున్న నిబంధనలపై స్పందించారు.

    వాల్‌మార్ట్‌కి చెందిన ఫ్లిప్‌కార్ట్‌, భారత్‌లో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రైస్ ఓపెన్ విధానాన్ని అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం కోరుతోంది.

    ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సంస్థలు రిలయన్స్‌తో పోటీపడతాయన్న ఆశతో అమెరికా భావిస్తోంది.

    భారత్‌లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ ఈకామర్స్‌ సంస్థలు సొంతంగా ఉత్పత్తి చేసిన వస్తువులు కాకుండా ఇతరుల వస్తువులనే విక్రయించాలి.

    కానీ దేశీయ కంపెనీలు మాత్రం తాము తయారుచేసిన ఉత్పత్తులను తమే అమ్ముకోవచ్చు.

    Details

    భారత ప్రభుత్వం నుండి తీవ్రమైన ప్రతిఘటన

    ఈ విధానం టారీఫేతర అడ్డంకిగా మారిందని అమెరికా ఆరోపిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్న పరిమితులు అమెరికాకు ఇబ్బందిగా మారాయి.

    2006 నుంచే అమెరికా తమ కంపెనీలకు భారత మార్కెట్‌ను తెరుచుకోవాలని యత్నిస్తున్నా, భారత ప్రభుత్వం నుండి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటోంది.

    అంతేకాదు విదేశీ ఈకామర్స్ వేదికలు తరచూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌ తనిఖీలకు లక్ష్యంగా మారుతున్నాయని కంపెనీలు ఆరోపిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో భారత్‌తో చర్చల సందర్భంలో అమెరికా విదేశీ సంస్థల ప్రయోజనాలకే కాక, స్థానిక రిటైల్ వ్యాపారులకు తగిన రక్షణ కల్పించాలన్న దృష్టితో జాగ్రత్తగా వ్యవహరిస్తోందని వర్గాలు వెల్లడించాయి.

    Details

    చిరు వ్యాపారులను నష్టపరిచేలా ఉండకూడదు

    ఆల్ ఇండియా ట్రేడర్స్ కన్ఫెడరేషన్ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ స్పందిస్తూ విదేశీ పెట్టుబడులు అవసరమే కానీ, వాటి పేరిట దేశీయ రిటైల్ మార్కెట్‌ను ఏకంగా మార్చడం, చిరు వ్యాపారుల ప్రయోజనాలను నష్టపరిచేలా ఉండకూడదని అన్నారు.

    ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియా 2013లో ప్రవేశించినప్పటి నుంచి తన పట్టు బలోపేతం చేసుకుంటూ వస్తోంది.

    ప్రస్తుతం అమెజాన్‌కు 40 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు ఉండగా ఫ్లిప్‌కార్ట్‌కు 50 మిలియన్ యూజర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో దేశీయ ఈకామర్స్‌ పోటీ మరింత రగిలే అవకాశాలున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    అమెరికా
    ఫ్లిప్‌కార్ట్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    భారతదేశం

    India Deports: అక్రమ వలసదారులపై భారత్ ఉక్కుపాదం.. ఫస్ట్ బ్యాచ్ లో 16 మంది విదేశీయులు  భారతదేశం
    India-US:అమెరికాలో దాక్కున్న గ్యాంగ్‌స్టర్ల జాబితా సిద్ధం చేసిన భారత్!   అమెరికా
    BRICS Conference: బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. భారత్-చైనా సరిహద్దు వివాదంపై కీలక చర్చలు బ్రెజిల్
    Ashwini Vaishnav: తొలి స్వదేశీ చిప్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఈ ఏడాదిలోనే విడుదల : అశ్వినీ వైష్ణవ్ అశ్విని వైష్ణవ్

    అమెరికా

    China tariffs: చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం వల్ల భారత ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు లాభాలు  చైనా
    Trump Tariff: చైనాపై 145 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌కు జులై 9 వరకు మినహాయింపు చైనా
    Donald Trump: ట్రంప్‌ను హతమార్చుతానంటూ వీడియో.. 32 ఏళ్ల వ్యక్తి అరెస్టు! డొనాల్డ్ ట్రంప్
    EVM: ఈవీఎంల భద్రతపై మళ్లీ చర్చ మొదలు.. హ్యాకింగ్‌ ఆధారాలు వెల్లడించిన అమెరికా అధికారి ప్రపంచం

    ఫ్లిప్‌కార్ట్

    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫీచర్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్ గూగుల్
    మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా మోటోరోలా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025