Page Loader
Crisil: భారతదేశంలో ఇళ్ల ధరలు సగటున 4-6% పెరగవచ్చు: క్రిసిల్ 
భారతదేశంలో ఇళ్ల ధరలు సగటున 4-6% పెరగవచ్చు: క్రిసిల్

Crisil: భారతదేశంలో ఇళ్ల ధరలు సగటున 4-6% పెరగవచ్చు: క్రిసిల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇళ్ల/ఫ్లాట్ల ధరలు మధ్య కాలంలో సగటున 4 నుంచి 6 శాతం వరకూ పెరిగే అవకాశముందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. గత రెండేళ్ల ఆర్థిక సంవత్సరాలలో ధరలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయని సంస్థ వివరించింది. ఇళ్లు,అపార్ట్‌మెంట్‌లు నిర్మించే రియల్‌ ఎస్టేట్ డెవలపర్లు ఈ ఆర్థిక సంవత్సరం పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా స్థిరమైన విక్రయాల్ని కొనసాగించగలుగుతారని క్రిసిల్ అభిప్రాయపడింది. కోవిడ్ అనంతరం తేరుకున్న త్రైమాసిక కాలం తర్వాత కూడా ఇళ్లకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని పేర్కొంది. విక్రయాల పరిమాణం సుమారు 5 నుంచి 7 శాతం వరకు పెరిగే అవకాశముండగా, సగటు ధరలు 4 నుంచి 6 శాతం మధ్య పెరుగవచ్చని అంచనా వేసింది.

వివరాలు 

డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉండే అవకాశం

2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లోనూ డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉండే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఇళ్లలో సుమారు 35 శాతం వాటా ఉన్న 75 ప్రధాన రియల్‌ ఎస్టేట్ సంస్థల పనితీరు, బ్యాలెన్స్‌ షీట్లు, రుణ చెల్లింపుల సామర్థ్యాలను క్రిసిల్ విశ్లేషించింది. ఈ సంస్థల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా, ఆరోగ్యంగా ఉన్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇళ్లకు డిమాండ్ పెద్దగా మారలేదని తెలిపింది. అంతేగాక, రుణ వడ్డీ రేట్లలో తగ్గుదల, ఇళ్ల ధరల పెరుగుదల తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందని క్రిసిల్ అభిప్రాయపడింది.