LOADING...
Excise Duty Hike: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై పన్నుల పెంపు..! కొత్త బిల్లులు తీసుకొచ్చిన కేంద్రం
కొత్త బిల్లులు తీసుకొచ్చిన కేంద్రం

Excise Duty Hike: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై పన్నుల పెంపు..! కొత్త బిల్లులు తీసుకొచ్చిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్-2025,అలాగే హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్-2025లను సభలో ఉంచగా,వీటి ద్వారా సిగరెట్లు, సిగార్లు, గుట్కా వంటి కూడా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీలను సవరిస్తూ కొత్త రేట్లు నిర్ణయించాలని సూచించింది. సిగరెట్లపై కొత్త ఎక్సైజ్ డ్యూటీ వెయ్యి స్టిక్స్‌కు రూ.2,700 నుంచి గరిష్టంగా రూ.11,000 వరకు ఉండనుండగా, ఈ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం ఫైనాన్స్ కమిషన్ విధానం ప్రకారం రాష్ట్రాలకు కూడా వాటా రూపంలో చేరనుంది.

వివరాలు 

40 శాతానికి పెరగనున్న పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ రేటు 

అయితే, కోవిడ్ సమయంలో జీఎస్టీ నష్టాలకు పరిహారంగా రాష్ట్రాలకు ఇచ్చిన బ్యాక్-టు-బ్యాక్ రుణాలు పూర్తిగా తీరిన తర్వాతే ఈ మార్పులు అమల్లోకి రానుండగా, ఆ తర్వాత సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ రేటు ప్రస్తుతం ఉన్న 28 శాతం నుంచి 40 శాతానికి పెరుగుతుంది. ఇక పాన్‌మసాలాపై ప్రత్యేకంగా హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్సును ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా వసూలు చేయాలని రెండో బిల్‌లో ప్రతిపాదించారు. ఈ సెస్సుతో వచ్చే మొత్తం రాష్ట్రాలకు పంచకుండా కేవలం కేంద్ర ప్రభుత్వమే వినియోగించనుండగా, అవసరమైతే సెస్సు రేట్లు మరింత పెంచే అధికారం కూడా కేంద్రం వద్దే ఉంటుంది. కోవిడ్ రుణాల చెల్లింపుల అనంతరం పాన్‌మసాలాపై కూడా జీఎస్టీ రేటు 28శాతం నుంచి 40శాతానికి పెరుగుతుంది.

వివరాలు 

15 రోజులపాటు యంత్రాలు నిలిపివేస్తే కొంత సెస్సు మినహాయింపు

పాన్‌మసాలా తయారీ యూనిట్లలో ప్రతి ఉత్పత్తి యంత్రం సామర్థ్యాన్ని తయారీదారులు తామే ప్రకటించాల్సి ఉండగా,నెలవారీగా ప్రతి నెల 7వ తేదీలోపు సెస్సు చెల్లించాలి. ఆలస్యమైతే 15 శాతం వడ్డీతో పాటు జరిమానాలు విధిస్తారు.కనీసం 15 రోజులపాటు యంత్రాలు నిలిపివేస్తే కొంత సెస్సు మినహాయింపు ఇస్తారు. యంత్రం ఒక్క నిమిషంలో 2.5 గ్రాముల ప్యాకెట్లను 500 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంటే నెలకు దాదాపు రూ.100 సెస్సు చెల్లింపుగా ఉండగా,ఈ సామర్థ్యం 1,000 నుంచి 1,500 యూనిట్లకు పెరిగితే నెలకు ఒక్క యంత్రంపై రూ.303 లక్షల వరకు సెస్సు ఉంటుంది.

Advertisement

వివరాలు 

10 గ్రాములకు మించి బరువు ఉన్న కంటైనర్లపై నెలకు ఏకంగా రూ.2,547 లక్షల వరకు సెస్సు

అలాగే 2.5 గ్రాములకంటే 10 గ్రాములలోపు ప్యాకెట్లపై నెలకు రూ.1,092 లక్షలు, 10 గ్రాములకు మించి బరువు ఉన్న కంటైనర్లపై నెలకు ఏకంగా రూ.2,547 లక్షల వరకు సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై 28 శాతం జీఎస్టీతో పాటు 5 శాతం నుంచి 290 శాతం వరకు ఉన్న ప్రత్యేక పరిహార సెస్సు కూడా వసూలవుతోంది.

Advertisement