LOADING...
IMF: ఇంధన ధరల పెరుగుదలతో ప్రపంచ వృద్ధికి ప్రమాదం.. ఐఎంఎఫ్ హెచ్చరిక
ఇంధన ధరల పెరుగుదలతో ప్రపంచ వృద్ధికి ప్రమాదం.. ఐఎంఎఫ్ హెచ్చరిక

IMF: ఇంధన ధరల పెరుగుదలతో ప్రపంచ వృద్ధికి ప్రమాదం.. ఐఎంఎఫ్ హెచ్చరిక

వ్రాసిన వారు Moogati Shabari
Apr 14, 2026
10:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారత ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని IMF తెలిపింది. జనవరిలో ఇచ్చిన 6.4 శాతం అంచనాతో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుదల మాత్రమే అని తెలుస్తోంది. అంతకుముందు అక్టోబర్‌లో ఇచ్చిన అంచనా 6.2 శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడు వరుసగా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. 2025లో భారత్ చూపిన బలమైన ఆర్థిక పనితీరు, అలాగే అమెరికా .. భారత వస్తువులపై టారిఫ్‌లను 50 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం ఈ సవరణకు ప్రధాన కారణాలుగా IMF పేర్కొంది.

వివరాలు

FY28లో కూడా 6.5% పెరుగుదల

2028 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ వృద్ధి 6.5 శాతం స్థిరంగా కొనసాగుతుందని IMF అంచనా వేసింది. తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ రిపోర్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే సంవత్సరాల్లో భారత్ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ అంచనా సూచిస్తోంది.

వివరాలు

అంతర్జాతీయ సంస్థల అంచనాలివే..

భారత ఆర్థిక వృద్ధిపై ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ ఇటీవల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 6.3 శాతం నుంచి 6.6 శాతానికి పెంచింది. దేశీయ డిమాండ్ బలంగా ఉండటం, ఎగుమతులు మెరుగుపడటం దీనికి కారణాలుగా తెలిపింది. అలాగే ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) కూడా తన అంచనాను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది.

Advertisement

వివరాలు

ప్రపంచ వృద్ధికి సంబంధించి ప్రమాదాలు, సవాళ్లు ఇవే..

కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి మరింత తగ్గే ప్రమాదం ఉందని IMF హెచ్చరించింది. ఇంధన ధరలు ఎక్కువగా పెరిగే పరిస్థితుల్లో 2026లో వృద్ధి 2.5 శాతానికి పడిపోయే అవకాశం ఉందని, అదే సమయంలో ద్రవ్యోల్బణం 5.4 శాతానికి పెరగొచ్చని తెలిపింది. మరింత తీవ్రమైన పరిస్థితుల్లో ఇంధన మౌలిక వసతులకు పెద్ద నష్టం జరిగితే, వృద్ధి 2 శాతానికి తగ్గే అవకాశం ఉందని, 2027 నాటికి ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించవచ్చని IMF హెచ్చరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య ఘర్షణలు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రమాదాలు ఇంకా కొనసాగుతాయని కూడా పేర్కొంది.

Advertisement