Page Loader
సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI
సింగపూర్ PayNow భాగస్వామ్యంతో భారతదేశం UPI గ్లోబల్ ఎంట్రీ

సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 21, 2023
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇకపైన భారతదేశం, సింగపూర్ మధ్య చెల్లింపులు సులభతరం కానున్నాయి. భారతదేశంకు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సింగపూర్ కు చెందిన PayNow భాగస్వామ్యంతో వేగంగా సరిహద్దు చెల్లింపులు చెయ్యచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్ ఈ రోజు వర్చువల్ గా క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. UPI-PayNow లింకేజీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (MAS) మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ఈరోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.

ప్రభుత్వం

UPI-PayNow లింకేజ్‌తో రెండు దేశాల బ్యాంక్ ఖాతాల నుండి సులభంగా డబ్బు బదిలీ చేసుకోవచ్చు

UPI-PayNow లింకేజ్‌తో, వినియోగదారులు భారతదేశం, సింగపూర్ మధ్య ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక బ్యాంకు ఖాతాకు తక్షణ ఫండ్ బదిలీలను చేయగలుగుతారు. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, మొబైల్ నంబర్‌లను ఉపయోగించి భారతదేశం నుండి సింగపూర్‌కు నిధుల బదిలీలు చేయవచ్చు. అదే సమయంలో, సింగపూర్‌లోని వ్యక్తులు UPI వర్చువల్ చెల్లింపు చిరునామాలను (VPA) ఉపయోగించి భారతదేశానికి నిధులను పంపగలరు. సింగపూర్ UPIని పూర్తిగా విలీనం చేసింది. ఇతర దేశాలు తమ చెల్లింపు వ్యవస్థను UPIతో అనుసంధానించడానికి పనిచేస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ IT మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం UPIని స్వీకరించడానికి భారతదేశం 13 దేశాలతో MOU సంతకం చేసిందని వైష్ణవ్ తెలిపారు.