Page Loader
UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్
UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్

UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 16, 2023
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తక్కువ-విలువ UPI లావాదేవీలను వేగంగా, మరింత సురక్షితంగా ఆటంకం లేకుండా, పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) భారతదేశంలో UPI LITEని ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఈ ఫీచర్‌ను అందించే దేశంలోనే మొదటి పేమెంట్స్ బ్యాంక్ పేటియం. NPCI అందించిన డేటా ప్రకారం, UPI లావాదేవీలలో 50% రూ. 200 కంటే తక్కువ. PPBL వినియోగదారులు ముందుగా వారి UPI LITE వాలెట్‌లో డబ్బును యాడ్ చేసుకోవాలి. రూ.2,000 వరకు రోజుకు రెండుసార్లు యాడ్ చేయచ్చు. యాడ్ చేసిన తర్వాత, వినియోగదారులు రూ.200 వరకు తక్షణ లావాదేవీలు చేయవచ్చు. బ్యాంకు లావాదేవీల సంఖ్యపై పరిమితి గురించి భయం లేకుండా ఈ చిన్న UPI చెల్లింపులు చేయవచ్చు.

పేటియం

నోయిడాలో పేటియం ప్రధాన కార్యాలయాన్ని 2015లో స్థాపించారు

సెప్టెంబర్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన UPI LITE, చిన్న-విలువ లావాదేవీలు, బ్యాంక్ డాక్యుమెంట్‌కు బదులుగా PPBL బ్యాలెన్స్ విభాగంలో చూపిస్తుంది. UPI LITE లావాదేవీల భద్రత దేశంలో మొబైల్ చెల్లింపులను కూడా పెంచుతుందని పేటియం పేర్కొంది. PPBL, జనవరిలో 1,765.87 మిలియన్ లావాదేవీలతో భారతదేశపు అతిపెద్ద UPI లబ్ధిదారుల బ్యాంకుగా నిలిచింది. 389.61 మిలియన్ లావాదేవీలతో UPI లావాదేవీల కోసం టాప్ 10 రెమిటర్ బ్యాంక్‌లలో ఇది కూడా ఒకటి. నేషనల్ ఎలక్ట్రానిక్స్ టోల్ కలెక్షన్ (NETC) FASTag విషయానికి వస్తే, 61.15 మిలియన్ లావాదేవీలు జరిగాయి. నోయిడాలో పేటియం ప్రధాన కార్యాలయాన్ని 2015లో స్థాపించారు. అధికారికంగా నవంబర్ 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది.